Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
కోట్ల రూపాయలు విసిరేస్తున్న బెల్లంకొండ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పై స్పెషల్ ఫోకస్
ప్లాప్ అయినా డిజాస్టర్ అయినా తన రేంజ్ ని ఏ మాత్రం తగ్గించుకోలేదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇక ఎంతో కాలం తరువాత ఒక్క హిట్టు పడడంతో బాబు అస్సలు తగ్గట్లేదు. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టాడు. ఛత్రపతిని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ఎలా తెరకెక్కిస్తారు అనే ప్రశ్న కన్నా కూడా సినిమాలో కోసం వాళ్ళు ఖర్చు చేసే విధానం ఎలా ఉంటుంది అనే దానిపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
తండ్రి సపోర్ట్ లేకుండానా..
సీనియర్ నిర్మాత బెల్లంకొండ గణేష్ పెద్ద కుమారుడైన బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా నుంచి కూడా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. కమర్షియల్ అయినా ప్రేమ కథ అయినా హై బడ్జెట్ లోనే చాలా ఈక్వల్ గా మెయింటైన్ చేసుకుంటూ వెళుతున్నాడు. తండ్రి బయటకు కనిపించకుండానే కొడుకుకు సపోర్ట్ చేస్తున్నారని చాలా కాలంగా రూమర్స్ వస్తున్నాయి.
మొదటి సినిమా నుంచి అదే రేంజ్..
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్స్ విషయంలో కూడా ఇంతవరకు తగ్గింది లేదు. అల్లుడు శీను సినిమాలో అప్పుడు టాప్ లో ఉన్న సమంతకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరి ఓకే చేయించారట. ఇక తమన్నాను స్పెషల్ ఐటెమ్ సాంగ్ లోకి దింపి కోట్లల్లో ఖర్చు చేశారు. విదేశాల్లో యాక్షన్ సీన్స్ అలాగే భారీ సెట్స్ తో సినిమాను చాలా కాస్ట్లీగానే డిజైన్ చేశారు.
ఛత్రపతి కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్
అప్పటి నుంచి ఈ బెల్లంకొండ రకుల్, కాజల్, పూజా హెగ్డే.. అంటూ స్టార్ హీరోయిన్స్ గా క్రేజ్ అందుకున్న ప్రతి ఒక్కరితో నటిస్తూ వస్తున్నాడు. ఇక ఇటీవల ఛత్రపతి కథతో బాలీవుడ్ ఎంట్రీ అనగానే ఈ సారి బాలీవుడ్ నుంచి అగ్ర నటిని తప్పకుండా దించుతారని చెప్పవచ్చు. ఆ లిస్ట్ లో కీయరా అద్వానీ ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. ప్రస్తుతం ఆ బ్యూటీ బాలీవుడ్ లో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.
Recommended Video
ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా రెడీ
తెలుగులో వినయ విధేయ రామ్ డిజాస్టర్ అనంతరం ఎందుకో ఇక్కడ మరో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు తెలుగు హీరో ఆమెను ఛత్రపతి రీమేక్ కోసం టార్గెట్ చేసినట్లు టాక్. ఇక రెమ్యునరేషన్ నాలుగు కోట్లయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. మరి ఆ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. వివి.వినాయక్ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.