Don't Miss!
- Finance IT News: టెక్ కంపెనీల్లో అత్యధిక జీతం ఆయనకే.. దేశీయ ఐటీ కంపెనీల్లో రికార్డు..
- News మేషరాశిలో సూర్య సంచారం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధననష్టం
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Lifestyle Marriage Day Wishes in Telugu : పెళ్లిరోజు శుభాకాంక్షల సందేశాలను ఇలా పంపండి..
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బెల్లంకొండ హీరో తగ్గట్లేదుగా.. బాలీవుడ్ ఎంట్రీ కోసం బాహుబలి రైటర్
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో గాని హైప్ మాత్రం మామూలుగా లేదు. రోజుకో రూమర్ సోషల్ మీడియాలలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కెరీర్ మొదటి నుంచి కూడా వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న సాయి శ్రీనివాస్ ఈ సారి అంతకుమించి అన్నట్లుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. డబ్బింగ్ సినిమాల హవాతో నార్త్ ఆడియెన్స్ కొంత ఆకర్షించిన ఈ హీరో ఏకంగా ఛత్రపతి కథతో డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు.
అయితే సినిమాను రీమేక్ చేసే దర్శకుడు ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో రైటర్ విషయంలో చిత్ర యూనిట్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలకు మొదటి నుంచి వర్క్ చేస్తున్న ఆయన తండ్రి కె.విజయేంద్రప్రసాద్ బెల్లంకొండ సినిమా కోసం మరోసారి ఛత్రపతికి రైటర్ గా వర్క్ చేయబోతున్నట్లు సమాచారం. ఛత్రపతి అసలు కథ ఆయనేదే. అయితే బాలీవుడ్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా సినిమా స్క్రీన్ ప్లేలో మార్పులు చేయనున్నారట.
ఇక దర్శకుడిగా వివి.వినాయక్ అయితే బెటర్ అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ముందుగా సుజిత్ కి ఆఫర్ ఇచ్చినప్పటికీ.. అతను ఒప్పుకోలేదట. ఎలాంటి రీమేక్స్ చేయడం లేదని ఇటీవల క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు వినాయక్ తో పాటు రచయిత విజయేంద్రప్రసాద్ కలిసి వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ ఛాన్సును ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నాడు. టాలీవుడ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన ఛత్రపతి ప్రభాస్ మార్కెట్ ని ఒక్కసారిగా పెంచేసింది. మరి బెల్లంకొండ హీరోకు ఆ కథ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.