Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
అప్పుడు నాని కారణంగా భీమ్లా నాయక్ ఛాన్స్ మిస్ చేసుకున్న యంగ్ డైరెక్టర్.. ఇప్పుడు అప్సెట్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భీమ్లా నాయక్ పేరు ఏ స్థాయిలో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి రోజు మొదటి షో చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చూస్తుంటే తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.
ఒక విధంగా ఈ సినిమాతో దర్శకుడు సాగర్ కే చంద్ర కెరీర్ కూడా ఒక్కసారిగా మారిపోతుంది అనే చెప్పాలి. అయితే ఇతని కంటే ముందే మరో యువ దర్శకుడికి ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చిందట. కానీ అతను హీరో నాని కారణంగా ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మారుతున్న దర్శకుల జీవితాలు
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఎవరికీ తెలియదు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుల కెరీర్ ఇటీవల కాలంలో ఒక్కసారిగా చేంజ్ అవుతున్నాయి. ఒక్క సక్సెస్ వచ్చినా చాలా ఈజీ గా స్టార్స్ తో సినిమా చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఉప్పెన దర్శకుడి స్థాయి ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.
భీమ్లా నాయక్.. లక్కీ ఛాన్స్
ప్రస్తుతం యువ దర్శకులకు కూడా అగ్ర హీరోలతో చేసే అవకాశం చాలా తొందరగానే లభిస్తోంది. ఒకప్పుడు ఎంత అనుభవం ఉంటేగాని స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దొరికేది కాదు. కానీ ఒక్క సక్సెస్ అందుకున్నా చాలు.. హీరోలు కూడా నేటి తరం దర్శకులు చాలా బాగా నమ్ముతున్నారు. ఇక బీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇంతకుముందు..
సాగర్ కె చంద్ర ఇంతకుముందు రాజేంద్రప్రసాద్ తో అయ్యారే అనే సినిమాతో పాటు శ్రీవిష్ణు తో అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కానీ బాక్సాఫీసు వద్ద సరైన లాభాలను అందించలేకపోయాయి. ఆ సినిమాలతో త్రివిక్రమ్ ను ఎక్కువగా ఆకర్షించిన సాగర్ భీమ్లా నాయక్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.
త్రివిక్రమ్ నిర్ణయమే ఫైనల్
భీమ్లా నాయక్ ప్రతి విషయంలో కూడా త్రివిక్రమ్ నిర్ణయాలు ఫైనల్ అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకు మాటలు అందించడమే కాకుండా దాదాపు దర్శకత్వ పర్యవేక్షణ తోపాటు అన్ని పనులను కూడా దగ్గరుండి చూసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే సాగర్ కంటే ముందు త్రివిక్రమ్ మరో యువ దర్శకుడిని ఫైనల్ చేయాలని అనుకున్నాడు.
మొదట వివేక్ ఆత్రేయతో..?
అయ్యప్పనుమ్ కొశీయుమ్ లాంటి రీమేక్ ను తెరకెక్కించాలి అంటే సాధారణమైన విషయం కాదు. ఇద్దరు హీరోలను ఒకవైపు నెగిటివ్ గా చూపిస్తూ మరొకవైపు పాజిటివ్ గా ప్రజెంట్ చేయాలి. ఇది చాలా తెలివిగా డైరెక్ట్ చేయాల్సిన సినిమా. ఇక దర్శకుడు త్రివిక్రమ్ మొదట భీమ్లా నాయక్ సినిమాను తెరకెక్కించడానికి వివేక్ ఆత్రేయను సంప్రదించాడట. ఇంతకుముందు ఈ దర్శకుడు బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో అనే సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను అందుకున్నాడు.
నాని సినిమా కారణంగా..
అయితే వివేక్ ఆత్రేయ అప్పటికే నాని తో ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు మైత్రి మూవీ మేకర్స్ కూడా అతనికి అడ్వాన్స్ ఇచ్చేసి ఒక్క ప్రాజెక్టు కూడా ఫిక్స్ చేసుకుంది. ఆ సినిమానే.. అంటే.. సుందరానికి. నాని కూడా అప్పుడు ఆ సినిమాను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరో దారి లేక భీమ్లా నాయక్ ను డైరెక్ట్ చేయలేకపోయాడట. ఇప్పుడు ఆ సినిమా చూసి ఈ దర్శకుడు మంచి ఛాన్స్ మిస్సయ్యింది అనే విధంగా కాస్త అప్సెట్ అయినట్లు కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి.