twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొత్తానికి మెగాస్టార్ కు కథ వినిపించిన నితిన్ దర్శకుడు

    |

    ఒక సినిమా హిట్టయితే ఒకప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరో సినిమా పై ఫోకస్ పెట్టేవారు. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే హీరోలు దర్శకులు మరో సినిమాను సెట్స్ పైకి తెస్తున్నారు. ఇక మెగా స్టార్ చిరంజీవి వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మరో యువ దర్శకుడు చెప్పిన కథపై మెగాస్టార్ పాజిటివ్ గా స్పందించారట.

    నితిన్ తో గత ఏడాది భీష్మ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుముల బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. ఆ దర్శకుడికి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ తో ఒక కమిట్మెంట్ ఉంది. మొదటి సినిమా ఛలో తోనే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించగలడని నిరూపించుకున్న వెంకీకి భీష్మ హిట్టు పడగానే చాలా మంది నిర్మాతల నుంచి ఆఫర్స్ వచ్చాయి.

    Bheeshma director venky kudumula story discussion with chiranjeevi

    ఇక ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కుడుముల ఇటీవల మెగాస్టార్ కు అయితే ఒక కథను వినిపించాడట. మెగాస్టార్ అతని కథపై పాజిటివ్ గా స్పందించినప్పటికి ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. మెగాస్టార్ సాధారణంగా ఏ కథకైనా సరే అంత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. వీలైనంత వరకు అనుభవం ఉన్న దర్శక రచయితలతో కూడా చర్చలు జరుపుతుంటారు. మరి వెంకీ కుడుముల కథపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి అంటే మరికొన్ని. రోజులు వేయిట్ చేయాల్సిందే.

    English summary
    Needless to say, the mega-fans are looking forward to the first film Acharya, directed by Megastar Chiranjeevi Star Director Koratala Siva. There has already been a clarion call that the megastar will appear in a different role than ever before. Otherwise, the suspense of the release of the film is yet to go.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X