Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కాజల్కు షాకిచ్చిన బడా డైరెక్టర్.. రకుల్ ఊహించి ఉండదు..!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమా భారతదేశంలో జరుగుతున్న అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేకాదు, అప్పటి వ్యవస్థను సూటిగా ప్రశ్నించింది. ఈ కారణంగానే 'భారతీయుడు' ఇప్పటికీ ఎవర్గ్రీన్ సినిమాగానే కితాబందుకుంది. అందుకే భారతీయుడు సినిమా దేశ సినీ చరిత్రలోనే ఉత్తమ పది చిత్రాల్లో చోటు దక్కించుకుంది.
ఇంతటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయాలని శంకర్- కమల్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు. దీనికి తగినట్లుగానే 'భారతీయుడు- 2' సినిమాను పోయిన ఏడాది మొదలుపెట్టారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్ను నిలిపివేసింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఆగిపోయిందని అంతా అనుకున్నారు. దీనికి తగినట్లుగానే కమల్ కూడా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. దీంతో సినిమా మళ్లీ పట్టాలెక్కదనే వార్తలు బయటకు వచ్చాయి.
బడ్జెట్ గురించి వచ్చిన విబేధాల వల్లే 'భారతీయుడు- 2' ఆగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిలిచిపోయిన తర్వాత శంకర్.. లైకా ప్రొడక్షన్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయట. అయితే, కమల్ ఈ మధ్య ఇరువురితో వేరు వేరుగా సమావేశం అయినట్లు తెలిసింది. బడ్జెట్ విషయంలో ఇటు శంకర్తోనూ.. అటు నిర్మాణ సంస్థతోనూ ఆయన చేసిన సంప్రదింపులు సఫలం అయ్యాయట. ఈ కారణంగానే 'భారతీయుడు- 2' త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతుందని పరిశ్రమ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ను తీసుకుంటున్నారని కూడా చెన్నైలో ప్రచారం జరుగుతోంది. కాజల్ను ఎందుకు తప్పించారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.