Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాజల్కు షాకిచ్చిన బడా డైరెక్టర్.. రకుల్ ఊహించి ఉండదు..!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన 'భారతీయుడు' ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఈ సినిమా భారతదేశంలో జరుగుతున్న అవినీతిని కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేకాదు, అప్పటి వ్యవస్థను సూటిగా ప్రశ్నించింది. ఈ కారణంగానే 'భారతీయుడు' ఇప్పటికీ ఎవర్గ్రీన్ సినిమాగానే కితాబందుకుంది. అందుకే భారతీయుడు సినిమా దేశ సినీ చరిత్రలోనే ఉత్తమ పది చిత్రాల్లో చోటు దక్కించుకుంది.
ఇంతటి గొప్ప సినిమాకు సీక్వెల్ చేయాలని శంకర్- కమల్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశారు. దీనికి తగినట్లుగానే 'భారతీయుడు- 2' సినిమాను పోయిన ఏడాది మొదలుపెట్టారు. కమల్ హాసన్ కూడా కొన్ని రోజులు షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే బడ్జెట్ విషయంలో విభేదాలు రావడంతో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రాజెక్ట్ను నిలిపివేసింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా ఆగిపోయిందని అంతా అనుకున్నారు. దీనికి తగినట్లుగానే కమల్ కూడా రాజకీయాల్లో బిజీ అయిపోయారు. దీంతో సినిమా మళ్లీ పట్టాలెక్కదనే వార్తలు బయటకు వచ్చాయి.
బడ్జెట్ గురించి వచ్చిన విబేధాల వల్లే 'భారతీయుడు- 2' ఆగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా నిలిచిపోయిన తర్వాత శంకర్.. లైకా ప్రొడక్షన్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయట. అయితే, కమల్ ఈ మధ్య ఇరువురితో వేరు వేరుగా సమావేశం అయినట్లు తెలిసింది. బడ్జెట్ విషయంలో ఇటు శంకర్తోనూ.. అటు నిర్మాణ సంస్థతోనూ ఆయన చేసిన సంప్రదింపులు సఫలం అయ్యాయట. ఈ కారణంగానే 'భారతీయుడు- 2' త్వరలోనే తిరిగి ప్రారంభం కాబోతుందని పరిశ్రమ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని అనుకుంటున్నారు. ఈ సమయంలోనే ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైన సమయంలో కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ను తీసుకుంటున్నారని కూడా చెన్నైలో ప్రచారం జరుగుతోంది. కాజల్ను ఎందుకు తప్పించారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.