Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ అదుర్స్ రిలీజ్ కు బ్లాక్ మెయిలింగ్ !?
జూ.ఎన్టీఆర్ హీరోగా చేసిన అదుర్స్ చిత్రం రిలీజ్ కావాలంటే నిర్మాతలు కోటి ఇరవై లక్షలు చెల్లించాలంటూ బ్లాక్ మెయిల్ జరిగిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో బహిరంగంగా వినపడుతోంది. ఈ బ్లాక్ మెయిల్ చేసింది తెలంగాణా ప్రాంతాలలో విడుదల ఆపుతామంటూ ప్రకటనలు ఇస్తున్న పెద్దమనుష్యులు అని చెప్తున్నారు. ఇక తెలంగాణ కు చెందిన ప్రముఖ నిర్మాత,పంపిణి దారుడు ఆధ్వర్యంలో జరిగిన రాయబా(బే)రంలో ఈ మొత్తానికి ఓకే అన్నట్లు తెలిసింది. ఇప్పటికే రకరకాల ఒత్తిళ్లుతో రిలీజ్ డేట్ వాయిదా పడుతున్న నేపధ్యంలో నిర్మాతలు ఈ డిమాండ్ కు తల ఒగ్గక తప్పలేదని చెప్తున్నారు.
ఇక ఇంత పెద్ద మొత్తం ఎందుకు ఇవ్వాలి అంటే మేము మా స్వంత రాష్ట్రం కోసం ఛేస్తున్న ఉద్యమానికి ఫండ్స్ ని ఈ రకంగా రైజ్ చేస్తున్నామని శెలవిచ్చారుట. దాంతో వెళ్లిన నిర్మాతల తరుపు మనుషులు ముందు రిలీజ్ అయితే చాలని అనుకున్నారుట. ఇక నైజాంలో విడుదల చేయాలంటే ఏ సినిమాకైనా ఈ విధంగా ఫండ్స్ ఇవ్వాల్సిందే అని చెప్పారని తెలుస్తోంది. అయితే వీరు నిజంగా ఆ ఫండ్స్ ని ఆ ఉద్యమం కోసం వినియోగిస్తారా లేదా అన్నది అక్కడ నాయకులే సమీక్షించుకోవాల్సిందే అంటున్నారు. ఇదే పద్దతి కొనసాగితే సమైఖ్యాంద్ర వారు కూడా తాము ఏమీ తక్కువ తినలేదని తమ ఉద్యమం నడిచేందుకు కావాల్సిన ఫండ్స్ ఈ విధంగా వసూలు చేస్తారనేది నిజం అని సీనియర్స్ అంటున్నారు..అదీ నిజమేగా.
ఎన్టీఆర్ హీరోగా వైష్ణవి ఆర్ట్స్ ప్రై.లి. సంస్థ నిర్మించిన చిత్రం 'అదుర్స్'. నయనతార, షీలా హీరోయిన్స్. వి.వి.వినాయక్ దర్శకుడు. ఎన్టీఆర్, వినాయక్ కలయికలో రూపుదిద్దుకున్న మూడో చిత్రం 'అదుర్స్'. సంక్రాంతి సందర్భంగా విడుదలకి సిద్ధం చేశారు. ఈ చిత్రంలో మహేష్ మాంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, రాజ్యలక్ష్మి, సుధ తదితరులు ఇతర పాత్రధారులు. సమర్పణ: కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), కథ-మాటలు: కోన వెంకట్, కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.