Don't Miss!
- News పవన్ కళ్యాణ్, చంద్రబాబుల కేసుల చిట్టా ఇదే!!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Sports DC vs GT: అందుకే డేవిడ్ వార్నర్ను పక్కన పెట్టాం: రిషభ్ పంత్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. 2019లో ఏకంగా మూడు సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంతో ఆయన ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ హిట్లను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!
ప్రభాస్ - రాకీ భాయ్: Salaar Movie Pooja & Launch Photos
బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్తో వస్తుంది
హిట్ కాంబినేషన్ కావడంతో నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను మూవీని ఎంతో రిచ్గా తీసేందుకు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ముందుకొచ్చారు. ఈ సినిమా దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే వచ్చిన భారీ చిత్రాల్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు. ఇక, ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ను ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకే ఒక్క డైలాగ్ మొత్తాన్ని మార్చేసిందిగా
వాస్తవానికి బోయపాటి - బాలయ్య కలయికలో రాబోతున్న ఈ సినిమాపై మొదట్లో ఏమాత్రం అంచనాలు లేవు. పైగా, మార్కెట్ కూడా జరిగే అవకాశాలు కనిపించలేదు. దీంతో నిర్మాత కూడా ఖర్చు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాడని అన్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన టీజర్.. పరిస్థితి మొత్తాన్ని మార్చేసింది. అందులో బాలయ్య చెప్పిన డైలాగ్తోనే అంచనాలు పెరిగిపోయాయి.
కెరీర్లో మొదటిసారి.... చెప్పకనే చెప్పారు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను.. హీరో క్యారెక్టర్ గురించి చెబుతూ.. ఇప్పటి వరకూ కనిపించని కొత్త పాత్రలో ఆయన కనిపిస్తాడని అన్నాడు. అఘోరా రోల్తో పాటు పవర్ఫుల్ రైతు పాత్రలోనూ నందమూరి హీరో నటిస్తున్నాడని సమాచారం.
ఆ విషయంలో నో క్లారిటీ.. పుకార్లు షికారు
ఇక, ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో ఎటువంటి క్లారిటీ రావడం లేదు. కానీ, ఈ సినిమాలో పలానా స్టార్ నటిస్తున్నాడో.. పలానా హీరోయిన్ చేస్తుందనో రెండు రోజులకో వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్, విలన్ విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ మూవీ తరచూ ట్రెండ్ అవుతోంది.
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో
రెండు భారీ హిట్ల తర్వాత రూపొందుతోన్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరోలు రాజశేఖర్, శ్రీకాంత్ విలన్లుగా చేస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. వీళ్లతో పాటు ఎంతో మంది హీరోల పేర్లు బయటకు వచ్చాయి. అందులో కొందరు హిందీ పరిశ్రమకు చెందిన వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టిని తీసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.
ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. అలా
వాస్తవానికి సునీల్ శెట్టి ఇందులో విలన్గా చేస్తున్నాడని గతంలోనూ ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత దీనిపై క్లారిటీ రాలేదు. అయితే, ఇప్పుడు ఇది నిజమని తెలుస్తోంది. బోయపాటి సినిమాలకు హిందీలో మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో చాలా సినిమాలు అక్కడ బాగా ఆడాయి. ఈ కారణంగానే బాలీవుడ్ హీరోను తీసుకోవాలనుకుంటున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.