Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరుణ్ తేజ్ తో పోటీకి సిద్దమవుతున్న మాస్ మహారాజ.. రెండు సినిమాలు ఒకేసారి?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా విడుదల తేది లపై హీరోల మధ్య నిర్మాతల మధ్య చాలా చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా చాలా వరకు ఎన్నో ఫెస్టివల్ రిలీజ్ డేట్స్ అన్నీ కూడా వృధా అయ్యాయి. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ ఐతే సమ్మర్ హాలిడేస్ పైన పడింది. వీలైనంతవరకు ఈసారి ఎలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఈసారి సమ్మర్ బరిలో పోటాపోటీగా వారి సినిమాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల మాస్ మహారాజా రవితేజ ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాది సంక్రాంతికి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. రవితేజ ఆ తర్వాత వెంటనే మరో సినిమాను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమాకు సరైన స్లాట్ దొరకకపోవడంతో ఫిబ్రవరిలో విడుదల చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. హిందీలో కూడా విడుదల చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఇక నెగిటివ్ రివ్యూలు అందుకోవడమే కాకుండా ఆ సినిమా బయ్యర్లకు గట్టిగానే నష్టాలను మిగిల్చింది.
ఇక ఈ సారి ఎలాగైనా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని రవితేజ సిద్ధమవుతున్నాడు. కొత్త దర్శకుడు శరత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కూడా యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ అంతకుముందే గని చిత్ర యూనిట్ సభ్యులు ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అసలైతే గని సినిమాను ఫిబ్రవరి 25వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే సమయానికి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదల అవుతుండటంతో వరుణ్ తేజ్ తన సినిమాను వాయిదా వేసుకోక తప్పలేదు.
ఇక ఇప్పుడు సమ్మర్ ఏప్రిల్ ఒకటవ తేదిన వరుణ్ తేజ్ గని సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను ఈసారి సమ్మర్ లో ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. పోటీగా రవితేజ సినిమా వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ ఫైట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రెండు సినిమాల కంటే ముందు మార్చ్ 25 వ తేదీన RRR సినిమా కూడా విడుదల కానుంది. సినిమా చాలా వరకు రెండు వారాలు నాన్ స్టాప్ గా వసూళ్లను అందుకునే అవకాశం ఉంటుంది. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో వస్తున్న సినిమా కావడం. అంతేకాకుండా సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించడం ఇలా అన్ని అంశాలు కూడా RRR సినిమా స్థాయిని రెండు వారాల పాటు పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి వరుణ్ తేజ్ రవితేజ ఈ పోటీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు.