Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హీరోయిన్లతో బోయపాటి మీట్.. చివరకు ఆ ఇద్దరు ఫైనల్.. బాలకృష్ణ 106 క్రేజీ అప్డేట్
గతేడాది బాలయ్యబాబు అనుకున్న సక్సెస్ అందుకోలేక పోయారు. మొదటి నుంచి చివరిదాకా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో 2020లో భారీ సక్సెస్లు సాధించి తన అభిమానుల్లో నుంచి ఆ నెగెటివ్ ఇంపాక్ట్ పోగొట్టాలని భావిస్తున్నారు బాలకృష్ణ. ఈ మేరకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 106వ సినిమా స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఆ వివరాలు చూద్దామా..
బాలయ్యకు సర్జరీ.. కారణం అదే
నందమూరి నటసింహం 106వ చిత్రానికి ఇటీవలే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు. ఈ మేరకు ఆయన సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం.
బాలయ్యకు జోడీగా ఇద్దరు భామలు
ఇకపోతే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ఇద్దరు క్రేజీ హీరోయిన్లు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా ఈ ఇద్దరూ సోనాల్ చౌహాన్, అంజలి అనే టాక్ బలంగా వినిపించినప్పటికీ.. వారిద్దరూ కాదనేది లేటెస్ట్ సమాచారం.
హీరోయిన్లతో బోయపాటి సంప్రదింపులు
ఫిలిం నగర్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా శ్రీయ, మరో హీరోయిన్ గా నయనతార నటించనుందని తెలుస్తోంది. `సింహా` తరహాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్గా నయనతార కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోయిన్లతో బోయపాటి సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని సమాచారం.
శ్రీయ, నయనతారలతో బాలయ్య రొమాన్స్
గతంలో సింహా, జై సింహా చిత్రాల్లో బాలయ్యతో కలిసి నటించింది నయనతార. అలాగే చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాల్లో నటించింది శ్రీయ. దీంతో ఈ సారి ఈ ముగ్గురూ కలిసి నటిస్తుండటం అనేది మరింత ఆసక్తికరంగా మారింది.
బోయపాటి స్కెచ్ ఇదే.. ఇక నుంచి
బాలయ్య- బోయపాటిది సక్సెస్ఫుల్ కాంబో కావడంతో ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇంతలో ఫినిష్ చేస్తారు అనే దానిపై బాలకృష్ణ అభిమానులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసి.. షూటింగ్ అంతా చకచకా ఫినిష్ చేసేలా బోయపాటి స్కెచ్ రెడీ చేశారట.