Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బాలయ్య సినిమా విషయంలో బోయపాటి షాకింగ్ డెసీషన్: అవన్నీ మార్చేస్తున్నాడట
ఒకప్పుడు వరుస విజయాలతో సత్తా చాటాడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. అయితే, రెండేళ్ల క్రితం రామ్ చరణ్తో తీసిన 'వినయ విధేయ రామ' ఫ్లాప్ తర్వాత ఆయన వేగం తగ్గించాడు. భారీ డిజాస్టర్ తర్వాత ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడీ యాక్షన్ డైరెక్టర్. ఇందులో భాగంగానే ఆ సినిమా వచ్చిన చాలా కాలానికి నందమూరి బాలకృష్ణతో ప్రాజెక్టును ప్రకటించాడయన. గత ఏడాది ప్రారంభంలోనే ఈ మూవీ పట్టాలెక్కినా.. అనివార్య కారణాల వల్ల ఇంకా చిత్రీకరణను పూర్తి చేసుకోలేదు. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత నటసింహా బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా విషయంలో ఈ క్రేజీ జంట ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇందులో బాలయ్య లుక్, పాత్రలు చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. అలాగే, ప్రతి దాన్ని పర్ఫెక్టుగా వచ్చేలా షూట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్క్రిప్టులో కొన్ని మార్పులు చేశాడట బోయపాటి. ఇందులో ఎమోషనల్ సీన్స్ మరిన్ని యాడ్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా చేస్తుండగా.. సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ మరో లీడ్గా చేస్తోంది. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి విలన్గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ చిత్రం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.