Don't Miss!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
బాలయ్యను మించిన బోయపాటి.. మరీ ఇంత డిమాండా? ఇంట్రెస్టింగ్ అప్డేట్
సీనియర్ హీరో బాలకృష్ణను మించి పోయారట మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలయ్య కంటే బోయపాటి డిమాండే ఎక్కువగా ఉందట. ఫిలింనగర్ సర్కిల్స్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాకు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దామా..
బోయపాటి శ్రీను- బాలకృష్ణ కాంబో
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూట్ కోసం రెడీ అవుతున్నారు ఈ ఇద్దరూ. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు హాట్ హాట్ చర్చలకు దారితీస్తున్నాయి.
మాస్ ఆడియన్స్ పల్స్.. అందుకేనా ఈ రేంజ్
ఈ సినిమా కోసమై బోయపాటి శ్రీనుకు నందమూరి నటసింహం బాలకృష్ణ కంటే ఎక్కువ రెమ్మ్యూనరేషన్ అందుతోందనేది తాజా సమాచారం. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ కావడంతో ఆయనకే ఎక్కువ పైకం చెల్లిస్తున్నారట నిర్మాత. ఇందులో బోయపాటి డిమాండ్ కూడా ఉందని కొందరు పేర్కొంటున్నారు.
బాలయ్యకు 10.. బోయపాటికి 15
బోయపాటి
శ్రీను-
బాలకృష్ణ
కాంబోలో
హాట్రిక్
మూవీగా
ప్రేక్షకుల
ముందుకు
రాబోతున్న
ఈ
సినిమా
కోసం
బాలయ్య
బాబుకు
10
కోట్ల
రెమ్మ్యూనరేషన్
ఇస్తుండగా,
బోయపాటికి
15
కోట్ల
రెమ్మ్యూనరేషన్
ఇస్తున్నారని
తెలిసింది.
దీంతో
ఓ
సీనియర్
హీరో
సినిమాపై
కూడా
బోయపాటి
డిమాండ్
ఇంతలా
ఉందా?
అని
చర్చలు
మొదలయ్యాయి.
మిర్యాల రవీందర్ రెడ్డి ప్లాన్ ప్లాన్ ఇదే..
మరోవైపు స్క్రిప్ట్ పరంగా ఈ సినిమా కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట బోయపాటి శ్రీను. చిత్రాన్ని మొత్తంగా 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించాలనేది నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్లాన్ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Recommended Video
బాలయ్య హీరోయిన్.. ఆమె నో అనేయడంతో
ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నటించనున్న హీరోయిన్ విషయంలోనూ చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కీర్తి సురేష్ని ఫైనల్ చేయాలని భావిస్తే, ఆమె నో చెప్పడిందని సమాచారం. దీంతో మరో హీరోయిన్ వేటలో పడిందట చిత్రయూనిట్.