Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వినయ విధేయ రామ ఎఫెక్ట్.. బోయపాటికి గీత ఆర్ట్స్ షాక్!
వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. మెగా అభిమానులు కూడా ఈ చిత్రంతో తీవ్రంగా నిరాశ చెందారు. బోయపాటి స్టైల్ లో రాంచరణ్ చెలరేగుతాడు అంటుకుంటే.. బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం తప్పలేదు. రాంచరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వినయ విధేయ రామ చిత్ర పరాజయం తర్వాత బోయపాటి శ్రీనుకు సమస్యలు మరింత ఎక్కువవుతున్నట్లు తెలుస్తోంది.
బయ్యర్లకు నష్టాలు
వినయ విధేయ రామ చిత్రానికి 90 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా ఆ స్థాయిలో లేకపోవడంతో కేవలం 60 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనితో బయ్యర్లు 30 కోట్ల మేర నష్టపోయారు. ఇటీవల రాంచరణ్ వినయ విధేయ రామ చిత్ర పరాభవంపై అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. ఈ ప్రెస్ నోట్ లో బోయపాటి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
దూరమైన క్రేజీ ప్రాజెక్ట్
వినయ విధేయ రామ చిత్ర ప్రభావంతో బోయపాటి శ్రీను నుంచి క్రేజీ ప్రాజెక్ట్ జారిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరైనోడు చిత్రం సమయంలోనే మెగాస్టార్, చిరంజీవి, బోయపాటి శ్రీను కాంబోలో చిత్రానికి బీజం పడింది. అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ప్రతిపాదన నుంచి గీత ఆర్ట్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
బాలయ్య సినిమా మాత్రమే
ప్రస్తుతం బోయపాటి చేతులో బాలకృష్ణ చిత్రం మాత్రమే ఉంది. ఈ చిత్రంతో తప్పనిసరిగా బోయపాటి నిరూపించుకోవాలి. ఇప్పటికే బోయపాటిపై రొటీన్ కథలతో చిత్రాలు చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. బాలయ్యతో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు బోయపాటి సన్నాహకాలు చేసుకుంటున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.
ఆదుకునేందుకు
ఇదిలా ఉండగా వినయ విధేయ రామ చిత్రంతో నష్టపోయిన బయ్యర్లని ఆదుకునేందుకు రాంచరణ్, నిర్మాత దానయ్య ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలసి బయ్యర్ల నష్టపరిహారం కోసం 15 కోట్ల వరకు అడ్జెస్ట్ చేశారట. ప్రస్తుతం రాంచరణ్ దానయ్య నిర్మాణంలోనే ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.