Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బాలయ్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఆయనతో సినిమా ఉంటుందట.. త్వరలోనే స్టార్ట్
బోయపాటి శ్రీను.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్న ఈ దర్శకుడు.. అనతి కాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపాడు. కానీ, ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంటున్నాడు. సంక్రాంతి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేసిన 'వినయ విధేయ రామ' తర్వాత బోయపాటి మరో సినిమాను ప్రారంభించలేదు. దీంతో అసలు సినిమా ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిరోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. బోయపాటితో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో బాలయ్య సినిమా ఆగిపోయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ ఈ సినిమానే చేయాల్సి ఉన్నా.. దీన్ని ఎందుకనే పక్కన పెట్టేశారని ఫిలింనగర్లో చెప్పుకుంటున్నారు. అందుకే కేఎస్ రవికుమార్తో ఆయన సినిమా చేస్తున్నాడని కూడా ఓ టాక్ వినిపిస్తోంది.
అయితే, తాజాగా బోయపాటి - బాలయ్య సినిమాపై ఓ వార్త బయటకు వచ్చింది. వీళ్లిద్దరూ త్వరలోనే ఓ సినిమాను చేయబోతున్నారనేదే దాని సారాంశం. ప్రస్తుతం కేఎస్ రవికుమార్ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. ఇది అయిపోయిన వెంటనే బోయపాటి సినిమాను స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ఇది నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభం కావచ్చని సమాచారం. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ 'సింహా', 'లెజెండ్'లో కనిపించినట్లే పవర్ఫుల్ రోల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలాఉండగా, కేఎస్ రవికుమార్తో చేసే సినిమా ఫస్ట్ షెడ్యూల్ను పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ. దాదాపు 20 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ థాయ్ల్యాండ్లో జరిగింది. ఇందులో భాగంగా కీలక నటులపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా.. భూమిక, ప్రకాశ్ రాజ్, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.