Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసిన బోయపాటి.. కారణం బాలయ్యేనా!
మాస్ ఆడియన్స్ అని ఆకట్టుకునేలా చిత్రాలు తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను ప్రత్యేక శైలి. మాస్ ఆడియన్స్ లక్ష్యంగానే ఆయన చిత్రాలు ఉంటాయి. బోయపాటి దర్శత్వంలో రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బయ్యర్లకు తీవ్రమైన నష్టాలనే మిగిల్చింది. ఈ చిత్ర పరాజయం దర్శకుడిగా బోయపాటికి ఓ మచ్చగా మిగిలిపోయింది. తదుపరి చిత్రంతో తిరిగి పుంజుకోవాలని బోయపాటి గట్టి పట్టుదలతో ఉన్నాడు. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన లో హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధం అవుతోంది.
మైత్రి మూవీస్ నిర్మాణంలో
బాలకృష్ణ, బోయపాటి చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇటీవల బాలయ్య ఎన్టీఆర్ మహానాయకుడు ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. బోయపాటితో చిత్రం ఎన్నికల తర్వాత ప్రారంభం అవుతుందని తెలిపాడు. మైత్రి మూవీస్ సంస్థతో బోయపాటి ఓ చిత్రం చేయడానికి ముందుగా ఒప్పందం కుదిరిందట. ఈ ఒప్పందం ప్రకారం వినయ విధేయ రామ చిత్ర రిజల్ట్ ని పట్టించుకోకుండా బాలయ్య, బోయపాటి చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రి మూవీస్ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
అడ్వాన్స్ వెనక్కు
కానీ ఊహించని విధంగా మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం బాలయ్యే అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని బోయపాటితో బాలయ్య చెప్పాడట. దీనితో బోయపాటి శ్రీను మైత్రి సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విధంగా బాలయ్య, బోయపాటి చిత్రం నుంచి మైత్రి సంస్థ తప్పుకుంది.
రెండు ఘనవిజయాలు
బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలయ్యకు తప్పనిసరిగా హిట్ అవసరం అన్న సమయంలో బోయపాటి సింహా చిత్రంతో విజయాన్ని అందించాడు. ఆ తర్వాత వచ్చిన లెజెండ్ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో తెరకెక్కించిన సరైనోడు చిత్రం కూడా ఘనవిజయం కావడంతో బోయపాటి క్రేజ్ మరింతగా పెరిగింది.
ఎన్టీఆర్ బయోపిక్
ప్రస్తుతం బాలయ్య, బోయపాటి ఇద్దరికీ హిట్ అవసరమే. ఎన్నో ఆశలు పెట్టుకుని తెరక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ బయోపిక్ ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ చిత్రంతో బోయపాటి జోరు కూడా తగ్గింది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రంతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.