Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నటసింహా బాలకృష్ణ ‘శ్రీరామ రాజ్యం’పై కోర్టులో కేసు...!
బాలకృష్ణ, బాపు కాంబినేషన్లో రూపొందిన 'శ్రీరామరాజ్యం' సినిమాపై ఓ ఫైనాన్షియర్ కోర్టుకెక్కారు. ఈ చిత్ర నిర్మాత తన నుంచి కొంత సొమ్ము తీసుకున్నారనీ, అయితే తన డబ్బు తిరిగి చెల్లించలేదనీ ఆ ఫైనాన్షియర్ హైదరాబాదు సివిల్ కోర్టులో కేసు వేశారు. దీనిపై నిన్న విచారణ చేపట్టిన న్యాయమూర్తి రాధారాణి, కొన్ని షరతులతో సినిమా విడుదలకు అనుమతిచ్చారు. ఆ మొత్తాన్ని నిర్మాత సదరు ఫైనాన్షియర్ కు చెల్లించినా, లేక కోర్టుకు జమచేసినా చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా శ్రీరామరాజ్యం సినిమా ఈ నెల 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాలో బ్రహ్మానందం చాకలి తిప్పడు" పాత్రను చేశాడు. ఆ పాత్ర రజకుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉంటుందేమోనని ఆ వర్గం వారు వివాదం రేపారని వార్తలు తెలియవస్తున్నాయి. ఈ చిత్రం నుంచి చాకలి తిప్పడు పాత్రను తొలగించాలని రజక సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారని సమాచారం. మరి ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాపు దర్శకత్వంలో బాలయ్య, నయనతార సీతారాములుగా రూపొందిన ఈ చిత్రం ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.