Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఇద్దరమ్మాయిలతో' లో ఆ సీన్స్ కోత
అలీ,బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ కు పూరీ జగన్నాధ్ సినిమాలు మొదటి నుంచి పెట్టింది పేరు. పోకిరి,సూపర్,చిరుత,కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అయితే తాజాగా వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో' ఆ సీన్స్ అసలు పండలేదు. అన్ని చోట్ల నుంచి ఈ సీన్స్ చెత్తాయని టాక్ వచ్చింది.
దాంతో రియలైజ్ అయిన టీమ్ వెంటనే ఆ సీన్స్ పై కోత వేసారు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మి,అలీ ట్రాక్ పూర్తిగా ఎత్తివేసారు. ఉన్నంతంలో కాస్త బోర్ తగ్గి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారు.
మరో ప్రక్క ఈ చిత్రంలో అల్లు అర్జున్ కులాల మీద చెప్పిన డైలాగులు చర్చనీయాంసంగా మారాయి. ఈ డైలాగులు హైలెట్ గా నిలిచి సినిమాని నిలబెడతాయని చాలా మంది అంచనాలు వేసారు. నిజానికి ఇటీవల కాలంలో ఏ తెలుగుసినిమా లోనూ కనిపించిని కాస్ట్ పీలింగ్ ఈ చిత్రంలో వ్యక్తమయ్యింది. డైలాగ్స్ తో ఆకట్టుకునే పూరీ జగన్నాధ్ ఈ సారి కలాన్ని కులం సిరాలో కలిపి రాసారు. హీరో,హీరోయిన్ల పెళ్లి మాటల సందర్భంలోనూ, వారి ప్రేమ సన్నివేశాల్లోనూ కులాల గోల మరీ ఎక్కువైంది. తన భార్య ఎలాగూ స్నేహా రెడ్డి కాబట్టి.. ఇలా పెట్టించాడా....సరదాకోసం చేసాడా అన్నది చర్చనీయాంసంగా మారింది.