Don't Miss!
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఆగడు’ ఎఫెక్ట్: నిర్మాతల మధ్య చీలిక?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా ‘ఆగడు' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కించిన నిర్మాతల మధ్య చీలిక ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ బేనర్లో అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. నమో వెంకటేశ నుండి మొదలై దూకుడు, 1 నేనొక్కడ్నే, లెజెండ్, ఆగడు వరకు వీరి ప్రయాణం సాగింది.
అయితే...‘ఆగడు' సినిమా సమయంలో ఏర్పడ్డ విబేధాలు నిర్మాతల మధ్య చీలికకు కారణమైంది, తన స్నేహితులైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటల నుండి వేరుపడి అనిల్ సుంకర వేరు కుంపటి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే విబేధాలకు కారణం ఏమిటనేది తెలియరాలేదు.
సునీల్
హీరోగా
అనిల్
సుంకర
సినిమా...
అనిల్
సుంకర
త్వరలో
నిర్మించబోయే
సినిమా
ద్వారా
ప్రముఖ
స్క్రీన్
ప్లే
రైటర్
గోపీ
మోహన్
త్వరలో
దర్శకుడిగా
పరిచయం
కాబోతున్నారు.
ఢీ,
రెడీ,
దుబాయ్
శీను,
సంతోషం,
వెంకీ,
కింగ్,
నమో
వెంకటేశ
తదితర
హిట్
చిత్రాలకు
రచయితగా
పని
చేసిన
గోపీ
మోహన్
సునీల్
హీరోగా
సినిమా
ప్లాన్
చేస్తున్నారు.
ఇక అన్నదమ్ములైన రామ్ ఆచంట్, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.