Don't Miss!
- News నేడే లాస్ట్ ఛాన్స్, పార్టీల్లో కొత్త టెన్షన్ - పులివెందులలో జగన్..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ బృందావనం సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కి దొరకని స్పాన్సర్స్...!
బృందావనం హిట్టయిందని సంబరపడిపోతున్న జూ ఎన్టీఆర్ ఆ ఆనందాన్ని అభిమానుల మద్యన జరుపుకోవాలని తెగ ఆరాటపడ్డాడు. అందుకోసం విజయవాడలో ఏర్సాట్లు కూడా చేస్తానని మాటిచ్చిన దిల్ రాజు ఆ వేడుకని స్పాన్సర్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో చేతులెత్తేశాడు. ఊరికే రూపాయి ఖర్చు పెట్టడానికి ఇష్టపడని దిల్ రాజు తన జేబుల్లోంచి డబ్బులు తీసి ఈ వేడుక ఎందుకు చేయాలంటూ సేఫ్ గా సైడైపోయాడు.
అసలే ఇప్పటికే ఈ సినిమా పై ఎంత లాభం వస్తుందో, అసలు లాభమొస్తుందో రాదో తెలియాని సందేహాలు ఇంకా వీడకపోవడంతో దిల్ రాజు ఖర్చు విషయంలో వెనుకా ముందూ ఆలోచిస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి వేడుకలని హీరోని బుట్టలో వేయడానికి చేస్తుంటారు కానీ దిల్ రాజు మాత్రం ఆ బాపతు కాదు. మంచి కథ పట్టుకుపోతే హీరో ఒప్పుకోక చస్తాడా అనే తెలివితేటలతో ముందుకు సాగుతుంటాడు. కాబట్టి ఎన్టీఆర్ ప్రాపకం కోసం అతనీ వేడుక చేయడనే అనాలి. ఆ విధంగా ఎన్టీఆర్ చేసుకుందమానుకున్న సంబరంపై స్పాన్సర్ల నిరాశపరచారునుకోవాలి.