Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మళ్లీ ఆ గ్రేట్ కాంబినేషన్.. సంగీత ప్రియులకు ఇక పండుగే
సినీ ప్రపంచంలో సంగీతానికి ప్రముఖ స్థానం ఉంటుంది. సినిమాల్లో పాటలు విరామానికి, ఊరటకు, హాయి నిచ్చేందుకు ఉపయోగపడుతుంటాయి. పాటలు లేకుండా అనేక చిత్రాలు వస్తున్నాయి కూడా. అయితే పాటలు సినిమాకు ప్లస్ అవుతాయి. ఆడియో కనుక హిట్ అయితే మూవీ కూడా దాదాపు హిట్ అయినట్టే. కొన్నిసార్లు మూవీ బాగా లేకపోయినా.. పాటలే ఆదుకున్న సందర్భాలున్నాయి. కేవలం పాటలతోనే సినిమాలను హిట్ చేసిన దర్శకులు కూడా ఉన్నారు. సంగీతానికి ఉన్న పవర్ అటువంటింది. అందుకే మనవాళ్లు సంగీతంపై అంతగా శ్రద్ద చూపిస్తుంటారు.
క్లాసిక్గా ఇళయరాజా-కృష్ణవంశీ కాంబినేషన్..
ఒక మూవీలో పాటలు బాగుండాలంటే.. దర్శకుడు, సంగీత దర్శకుడు ఆలోచనలు, మనస్తత్వాలు ఒక్కటై ఉండాలి. అలాంటప్పుడే మంచి పాటలు పుట్టుకొస్తాయి. ఇళయ రాజా, కృష్ణవంశీది అలాంటి ఓ రేర్ అండ్ గ్రేట్ కాంబినేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన అంత:పురం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో.. పాటలు అంతకన్నా ఎక్కువ సక్సెస్ అయ్యాయి. ఆ మూవీలోని మెలోడి (అసలేం గుర్తుకు రాదు..) నేటికీ మంచి ఆదరణను పొందుతుంది.
సంగీతానికి పెద్ద పీఠ వేసే కృష్ణవంశీ..
స్వతాహాగా సాహిత్య పరంగా మంచి అభిరుచి ఉన్న డైరెక్టర్ కృష్ణవంశీ. తన ప్రతీ సినిమాలో సంగీతానికి పెద్ద పీఠ వేస్తాడు. ఆయన గత చిత్రాలను చూస్తేనే అది అర్థమవుతుంది. ప్రతీ సినిమాలో మెలోడీకి ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. వాటిని చిత్రీకరించడంలోనే ప్రత్యేక శ్రద్ద చూపిస్తాడు.
రంగమార్తాండకు మళ్లీ అదే కాంబినేషన్..
మళ్లీ ఇన్నాళ్లకు ఆ కాంబినేషన్ సెట్ అయింది. ఇళయారాజా, కృష్ణవంశీ కలిసి పనిచేయనున్నట్లు సమాచారం. కృష్ణవంశీ తాజాగా ఓ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరాఠా హిట్ చిత్రం నట సామ్రాట్ను తెలుగులో రంగమార్తాండగా రీమేక్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశాడు. ఈ మూవీకి ఇళయరాజా సంగీతాన్ని అందించనున్నాడని తాజా సమాచారం.
ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ..
ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలె ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇంట్లో దిగిన ఆ ఫోటోను ఆయన భార్య పోనీ వర్మ ట్వీట్టర్లో షేర్ చేస్తూ.. పని రాక్షసులు అంటూ సరదాగా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించే వారు చర్చించుకున్నారని సమాచారం. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.