Don't Miss!
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్యాక్షన్ ఉచ్చులో బిగుసుకొన్న బాలయ్య పరమ వీర చక్ర...
కోట్లు ఖర్చు పెట్టి మరీ వరసగా భయంకరమైన ప్లాపులిచ్చిన నిర్మాత సింగనమల రమేష్ బాబు దగ్గర ఒక్క ఏడాదిలో వంద కోట్లు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయో అనుకునే వాళ్లకి ఫ్యాక్షన్ రారాజు మద్దెల చెరువు సూరి హత్యే సమాధానం అయ్యింది. ఖలేజ, పులి లాంటి రెండు అడ్డగోలు చిత్రాలను సూరి దగ్గర నుండి ఫైనాన్స్ తీసుకునే సి కళ్యాణ్, సింగనమలలు పూర్తి చేసి విడుదల చేసారని దర్యాప్తులో తేలడంతో ఇంకెంత బాకీ ఉన్నారన్నదే అసలు క్వశ్చన్.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇచ్చిన షాక్ తో ఒళ్లు గుల్ల చేసుకున్న సింగనమల హైదరాబాద్, బెంగుళూరులలో ఉన్న తన ఆస్థి మొత్తం సూరికి అప్పగించేస్తే కళ్యాణ్ మాత్రం 'పరమ వీర చక్ర" మీదనే ఆశలు పెట్టుకుని బతుకుతున్నాడు. మరి సూరి ఫ్యాక్షన్ అనుచరులు బాకీ కింద పరమ చెత్తగా తయారయ్యిందన్న పరమ వీర చక్రను జప్తు చేస్తారా లేక వదిలేస్తారా అన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుందేమో చూడాలి..