Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ బాబుని సిబిఐ వాళ్ళు ప్రశ్నిస్తారా?
మహేష్ బాబుని, అతని నమ్రతని సిబిఐ వారు సెప్టెంబర్ 14 న ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ ని సెప్టెంబర్ 15 న ,గల్లా పద్మావతిని సెప్టెంబర్ 16 న విచారిస్తారు. వీరి విచారణకు కారణం హైదరాబాద్ లోని గచ్చి బౌళి వద్ద ఎమ్మార్ ఎమ్ జి ఫ్ వారు డవలప్ చేసిన విల్లాలను కొనుగోలు చేయటమే నని తెలుస్తోంది. ఈ మేరకు వారికి సిబిఐ వారికి నోటీసులు ఇష్యూ చేసినట్లు చెప్తున్నారు. ఆ ఎఫైఆర్ లో సిబిఐ ఆరోపించింది ఏమిటంటే..స్వ్కేర్ ఫీట్ ఐదు వేలు చొప్పున చెల్లించి అక్కడ ప్లాట్ లను తీసుకున్నారని,వాటి రిజిస్ట్రేషన్ కి పదిహేను వేలు ఖర్చు పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు దూకుడు షూటింగ్ బిజీలో ఉన్నారు. ఇక మహేష్ బాబు తాజా చిత్రం దూకుడుకోసం గత మూడురోజులుగా ఐటం సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చాలా కలర్ ఫుల్ గా శ్రీను వైట్ల చిత్రీకరించాడని,మహేష్ కెరీర్ లో నిలబడిపోయే పాటగా దీన్న చిత్రీకరించారని చెప్తున్నారు .అలాగే ఈ చిత్రాన్ని ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమైపోతున్నారు.తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.