Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
బెయిల్ కు అప్లయ్ చేసుకున్న శిరీష్ పై లుక్ అవుట్ నోటీసులు...?
చిరంజీవి రెండవ కూతురు భర్త శిరీష్ భరద్వాజ్ కట్నం వేధింపుల కేసులో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. శ్రీజ భర్త శిరీష్ పై హైదరాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై 498(ఏ), కట్నం వేధింపుల నిరోధక చట్టం 3, 4 కింద కేసులు నమోదు చేశారు. ఇవి బెయిలుకు వీలుకాని సెక్షన్లు కావడంతో నాంపల్లి క్రిమినల్ కోర్టులో ముందస్తు బెయిలు అభ్యర్థనను కోరుతూ శిరీష్, ఆయన తల్లి సూర్యమంగళ పేర్లతో బుధవారం సమర్సించారు.
ఐతే ప్రస్తుతం శిరీష్, అతని తల్లి అజ్ఞాతంలోకి వెళ్ళారు. తమ దరఖాస్తుపై నిర్ణయం వెలువడేలోగా పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న అనుమానంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. మహిళా పోలీసు అధికారులు శిరీష్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా నాలుగు రోజుల క్రితమే శిరీష్ ఎక్కడికో వెళ్లాడని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు.