Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆర్య-2 పై సెన్సార్ బోర్డు ఛీఫ్ స్పెషల్ ఇంట్రస్టు ఏంటో
అల్లు అర్జున్,కాజల్,నవదీప్ కాంబినేషన్ లో సుకుమార్ రూపొందించిన ఆర్య-2 చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ ఛీఫ్ ఎగ్జామినింగ్ ఆఫీసర్ టి.వి.కె రెడ్డి తన ఇంటి వద్ద ప్రత్యేక షో వేయించుకుని వీక్షించారని సమాచారం. సాధారణంగా ఎపిఎఫ్ డి సి ప్రివ్యూ ధియోటర్స్ లో మిగతా సెన్సార్ బోర్డ్ మెంబర్స్ తో కలసి చిత్రాలు చూస్తూడంటం ఆనవాయితి. కానీ శుక్రవారం(19వతేది)ఈ చిత్రం ఆయన తన ఇంటి వద్ద చూడటంపై ఫిల్మ్ సర్కిల్స్ లో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. చాలా పెద్ద సినిమాలు సెన్సార్ బారి నుండి తప్పించుకునేందుకు ఆ మెంబర్స్ ని ఛీప్ ని మంచి చేసుకోవటం కొత్త కాదని, అయితే ఇలా ఇంటికెళ్ళి మరీ సినిమా చూపటం వింతే అంటున్నారు. ఇక డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు ఆయన అభిప్రాయం అడగటానికే ఈ చిత్రం ఆయన ఇంటి వద్ద వేసారని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఆయన చూసాకే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై అంతటా చర్చ జరుగుతోంది. టీవీకె రెడ్డి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని చూడాల్సిన అవసరం ఏమిటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.