Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'మహిమ'లు చూపిస్తానంటున్న చంద్రశేఖర్ ఏలేటి
హైదరాబాద్ :వారాహి చలనచిత్రం పతాకంపై చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో నిర్మాత కొర్రపాటి సాయి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘మహిమ' నే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టుకు సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ చేసారు చంద్రశేఖర్. మోహన్ లాల్ - గౌతమి - ఇర్ఫాన్ ఖాన్ లాంటి గ్రేట్ ఆర్టిస్టులతో సినిమా అనౌన్స్ చేశాడు. టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఐతే లాంటి సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చంద్రశేఖర్ ఏలేటి, ఈ చిత్రాన్ని మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న ఓ మధ్య తరగతి కుటుంబాల నేపథ్యంలో సాగే సినిమాని తెరకెక్కించబోతున్నాడని సమాచారం.
అలాగే ఈ చిత్రం కన్నడ వెర్షన్ కోసం మోహన్ లాల్ స్థానంలో శివరాజ్ కుమార్ ను ఎంచుకున్నాడతను. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ జరుగుతున్నఈ సినిమాను నవంబరు నెలాఖర్లో మొదలుపెట్టి మూడు నెలల్లో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.