twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛార్మి సినిమా వెనుక?

    By Staff
    |

    Charmi
    హాట్ ఫేవరెట్ ఛార్మి తాజాగా 'మనోరమ' అనే చిత్రంతో ముందుకొస్తోంది. మీ శ్రేయాబిలాషి..ఈశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం రూపొందించే ప్రాసెస్ లో రకరకాల కథలు జరిగాయని కామెంట్స్ వినపడుతున్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఓ నిర్మాత ప్రారంభించి చేతులు ఎత్తేయటం..ఆ తర్వాత దాన్ని జీ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ వారు టేకోవర్ చేయటం జరిగింది. అయితే జీ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ఇంతకుముందు ఎస్వీ కృష్ణారెడ్డితో మస్త్ అనే చిత్రం రూపొందించారు. అది డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది.

    దాంతో జీ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ ఇక్కడ సినిమా విభాగం చూస్తున్న నటుడు సురేష్ పై విమర్శలు గుప్పుమన్నాయి. కమీషన్ విపరీతంగా తీసుకుని ఎలాంటి కథ అయినా ఓకే చేస్తాడని, చంద్ర సిద్దార్ధ వంటి టాలెంటెడ్ దర్శకుడు సైతం ఆ కమీషన్స్ బాధ పడలేక బయిటపడ్డాడని అంతా అన్నారు. ఇక కమీషన్స్ ఇచ్చి మిగిలిన బడ్జెట్ తో సినిమా పూర్తి చేస్తే అట్లాటి రిజల్టే వస్తుందని మస్త్ కి పనిచేసిన వారు బయిట అన్నారని ఫిల్మ్ నగర్ లో వినపడింది. ఈ నేపధ్యంలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మనోరమ ఎంతవరకూ విజయం సాధిస్తుందనే చర్చలు వినపడుతున్నాయి.

    మనోరమ అనేది హోటల్ పేరని..అప్పట్లో హైదరాబాద్ కోటి ప్రాంతంలో జరిగిన గోకుల్ ఛాట్ సంఘటన బేస్ చేసుకుని, ఓ ఫారిన్ చిత్రాన్ని కలిపి కథ అల్లారని చెప్పుకుంటున్నారు. శ్రేయాభిలాషి చిత్రం కూడా ఓ జపన్ చిత్రం ఆధారంగా తీసిందనే సంగతి తెలిసిందే. ఇక అందులో ఛార్మి..పాత్ర టెర్రరిస్టు అయిన హీరోలో మార్పు తేవటమని అంటున్నారు. నిజా నిజాలు ఎలా ఉన్నా ఛార్మికి ఇప్పుడో హిట్ కావాలి. భాక్సాఫీస్ వద్ద ఆమె లేటెస్ట్ చిత్రం సిక్సీన్ డేస్ సైతం డిజాస్టర్ ఫలితాన్ని పొందింది. దాంతో ఆమెకు హిట్టు ఇవ్వగలిగితే దర్శక, నిర్మాతలు సక్సెస్ అయినట్లే. అలా అవ్వాలనే కోరుకుందాం. ఇక ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X