twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవిశ్రీ ని ఒప్పించిన ఛార్మి

    By Staff
    |

    Charmi
    మంత్ర సినిమాతో ఒక్క సారిగా పూర్తి స్ధాయి డిమాండ్ లోకి వచ్చిన తార ఛార్మీ. అలాగే వరస హిట్లతో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అయితే వీరిద్దరి మధ్యా ప్రేమానుబంధం ఉందని...ఆమె సెట్స్ కి తరుచూ దేవీ వెళ్తూంటాడని చెప్తూంటారు. అయితే తన కిష్టమైన ఛార్మి పాత్ర చుట్టూ తిరిగే సినిమాలకేమీ దేవీ సంగీతం అందించలేదు.ఎందుకంటే దేవీ పారితోషికం ఛార్మి సినిమా బడ్జెట్ కి దగ్గరలో ఉంటుందని అంటారు.

    అయితే తొలి సారిగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలసి పనిచేయబోతున్నారు. 'యమగోల మళ్ళీ మొదలైంది' నిర్మాత రాజశేఖర్ నిర్మిచతలపెట్టిన చిత్రంలో ఈ కాంబినేషన్ కలవబోతోంది. పవన్ అనే కొత్త దర్శకుడు డైరక్షన్ చేయనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాకి మొదట దేవీ ఒప్పుకోకపోయినా ఛార్మి ఒక్క ఫోన్ కాల్ తో ఒప్పించిదని ఫిల్మ్ నగర్ సమాచారం. ఎవరికి ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పితేనే పనులవుతాయనేది దీని సారాంశం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X