Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ప్రభాస్ 'ఛత్రపతి' బాలీవుడ్ రీమేక్ గా...
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'ఛత్రపతి'. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయటానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమౌళి సినిమాలు 'విక్రమార్కుడు', 'మర్యాదరామన్న' చిత్రాలు అక్కడ రీమేక్ అవుతున్న నేపధ్యంలో బాలీవుడ్ లోని ఓ పెద్ద నిర్మాణ సంస్ధ ఈ చిత్రం రైట్స్ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అజయ్ దేవగన్ ఈ చిత్రం రీమేక్ లో చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఇక రవితేజతో చేసిన 'విక్రమార్కుడు'ని ప్రభుదేవా ..హిందిలో అక్షయ్ కుమార్ తో.. 'రౌడీ రాథోడ్' రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే అక్కడివారి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుని మంచి బిజినెస్ చేసిపెట్టింది. అలాగే 'మర్యాదరామన్న' చిత్రాన్ని అజయ్ దేవ్గన్తో 'సన్నాఫ్ సర్దార్' పేరిట రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా ఇదే ఏడాదిలో విడుదలవుతుంది. ఆ సినిమాకి కూడా ట్రేడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. మరో ప్రక్క 'మగధీర'ని రీమేక్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
వీటిన్నటికి తోడు రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'కి బాలీవుడ్ మీడియా మంచి ప్రయారిటీ ఇస్తోంది. ఈ చిత్రం ట్రెయిలర్తో బాలీవుడ్ దృష్టిని, నేషనల్ మీడియా అటెన్షన్ని తనవైపుకి తిప్పుకున్నారు. దాంతో రాజమౌళి చిత్రాలపై బాలీవుడ్ దృష్టి పడింది. అసలే రీమేక్ లో హిట్లు కొడుతున్న బాలీవుడ్ కి రాజమౌళి సినిమాలు మినిమం గ్యారెటీ సినిమాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో రాజమౌళి సినిమాలు రెండూ హిందీలో విడుదల కావటానికి సన్నాహాలు జరగటం కూడా ప్లస్ అయ్యింది.
ఇక ఈగ విషయానికి వస్తే...ఈ చిత్రం ప్రారంభం రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. అపజయం ఎరగని రాజమౌళి చిత్రం కావటం,కొత్త కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందటం,పిల్లలు పెద్దలు తేడా లేకుండా చూడగలిగే కథ కావటం సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పెరిగిన అంచనాలకు ఈ బడ్జెట్ పెద్ద మొత్తమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకుల అంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది.
'ఈగ' సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.