Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలయ్య, వినాయక్... సీక్వెల్ అంటూ పుకారు
హైదరాబాద్: బాలయ్యతో 'చెన్నకేవశరెడ్డి' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వివి వినాయక్ తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్గా 'చెన్నకేశవరెడ్డి-2' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారనే రూమర్ ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్తో 'నాయక్' చిత్రం తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుందట. బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మించనున్నట్లు చర్చించుకుంటున్నారు.
2002లోనే విడుదలైన చెన్నకేశవరెడ్డి చిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేక బోల్తా పడింది. అయితే అభిమానులు మాత్రం ఈ చిత్రం హిట్గా పరిగణిస్తున్నారు. తాజాగా రూపొందబోయే చిత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని, బాలకృష్ణను కొత్త యాంగిల్లో చూపించడానికి వినాయక్ ట్రై చేస్తున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం బాలయ్య 'శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లుగా రవికుమార్ చావలి దర్శకత్వంలో పుప్పాల రమేష్ నిర్మాతగా ఎల్లో ఫ్లవర్స్ బేనర్పై రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 30న గ్రాండ్గా విడుదలవుతోంది.
ఇక వివి వినాయక్ ప్రస్తుతం రామ్ చరణ్ తో 'నాయక్' చిత్రం రూపొందిస్తున్నారు. కాజల్ అమలపాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.