Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంటపడుతున్న ‘బుల్లి’-భయపడుతున్న చిరు?
కారణం ఏమంటే...టీవీ లైవ్ షోల్లో పాల్గొని శ్రోతలు అడిగి ప్రశ్నలకు, తన తోటి రాజకీయ చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పడానికి చిరంజీవికి ఇబ్బంది కావడమే. ఆ మధ్య ఓయూ జేఏసీ నాయకుడు సుమన్ వేసిన ప్రశ్నకు చింజీవి సమాధానం చెప్పకుండానే నిష్క్ర్రమించాడు. అప్పటి నుంచి చిరంజీవి మళ్లీ టీవీ లైవ్ షోల్లో పెద్దగా కనిపించ లేదు. కనీసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న నేపథ్యంలో....ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కూడా చిరంజీవి ప్రయత్నించ లేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ఒప్పుకోవాలే గానీ..ఆయనతో లైవ్ షోలు, ఇంటర్యూలు నిర్వహించడానికి దాదాపు 30 వరకు బుల్లి తెర న్యూస్ ఛానల్స్ క్యూలో ఉన్నాయి. కానీ చిరంజీవి భయంతో రావడం లేదని ప్రచారం జరుగుతోంది.
రాజకీయ నాయకుడు అనే వాడు ప్రజలతో మమేకమై, వారి అభిప్రాయాలను పాలుపంచుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అందుకు ఎలక్ట్రానిక్ మీడియా మంచి సాధనం. కానీ చిరంజీవి ఆ ఉద్దేశ్యం లేనట్లు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండా ఒంటెద్దు పొకడలు పొతున్నాడు కాబట్టే చిరంజీవి రాజకీయాల్లో వెనకబడి పోతున్నాడనే వారు కూడా లేక పోలేదు. మరి ఈ విషయాన్ని చిరంజీవి ఎప్సుడు అర్థం చేసుకుంటారో?