Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంటపడుతున్న ‘బుల్లి’-భయపడుతున్న చిరు?
కారణం ఏమంటే...టీవీ లైవ్ షోల్లో పాల్గొని శ్రోతలు అడిగి ప్రశ్నలకు, తన తోటి రాజకీయ చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పడానికి చిరంజీవికి ఇబ్బంది కావడమే. ఆ మధ్య ఓయూ జేఏసీ నాయకుడు సుమన్ వేసిన ప్రశ్నకు చింజీవి సమాధానం చెప్పకుండానే నిష్క్ర్రమించాడు. అప్పటి నుంచి చిరంజీవి మళ్లీ టీవీ లైవ్ షోల్లో పెద్దగా కనిపించ లేదు. కనీసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న నేపథ్యంలో....ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కూడా చిరంజీవి ప్రయత్నించ లేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ఒప్పుకోవాలే గానీ..ఆయనతో లైవ్ షోలు, ఇంటర్యూలు నిర్వహించడానికి దాదాపు 30 వరకు బుల్లి తెర న్యూస్ ఛానల్స్ క్యూలో ఉన్నాయి. కానీ చిరంజీవి భయంతో రావడం లేదని ప్రచారం జరుగుతోంది.
రాజకీయ నాయకుడు అనే వాడు ప్రజలతో మమేకమై, వారి అభిప్రాయాలను పాలుపంచుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అందుకు ఎలక్ట్రానిక్ మీడియా మంచి సాధనం. కానీ చిరంజీవి ఆ ఉద్దేశ్యం లేనట్లు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండా ఒంటెద్దు పొకడలు పొతున్నాడు కాబట్టే చిరంజీవి రాజకీయాల్లో వెనకబడి పోతున్నాడనే వారు కూడా లేక పోలేదు. మరి ఈ విషయాన్ని చిరంజీవి ఎప్సుడు అర్థం చేసుకుంటారో?