Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంటపడుతున్న ‘బుల్లి’-భయపడుతున్న చిరు?
కారణం ఏమంటే...టీవీ లైవ్ షోల్లో పాల్గొని శ్రోతలు అడిగి ప్రశ్నలకు, తన తోటి రాజకీయ చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పడానికి చిరంజీవికి ఇబ్బంది కావడమే. ఆ మధ్య ఓయూ జేఏసీ నాయకుడు సుమన్ వేసిన ప్రశ్నకు చింజీవి సమాధానం చెప్పకుండానే నిష్క్ర్రమించాడు. అప్పటి నుంచి చిరంజీవి మళ్లీ టీవీ లైవ్ షోల్లో పెద్దగా కనిపించ లేదు. కనీసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్న నేపథ్యంలో....ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి కూడా చిరంజీవి ప్రయత్నించ లేదంటే విషయం అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి ఒప్పుకోవాలే గానీ..ఆయనతో లైవ్ షోలు, ఇంటర్యూలు నిర్వహించడానికి దాదాపు 30 వరకు బుల్లి తెర న్యూస్ ఛానల్స్ క్యూలో ఉన్నాయి. కానీ చిరంజీవి భయంతో రావడం లేదని ప్రచారం జరుగుతోంది.
రాజకీయ నాయకుడు అనే వాడు ప్రజలతో మమేకమై, వారి అభిప్రాయాలను పాలుపంచుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. అందుకు ఎలక్ట్రానిక్ మీడియా మంచి సాధనం. కానీ చిరంజీవి ఆ ఉద్దేశ్యం లేనట్లు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలతో సంబంధం లేకుండా ఒంటెద్దు పొకడలు పొతున్నాడు కాబట్టే చిరంజీవి రాజకీయాల్లో వెనకబడి పోతున్నాడనే వారు కూడా లేక పోలేదు. మరి ఈ విషయాన్ని చిరంజీవి ఎప్సుడు అర్థం చేసుకుంటారో?