కొన్నేళ్ల తర్వాత మళ్ళీ 'పంజా' స్టేజిపై మెరవనున్నమెగా కల...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'పంజా" చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను మొదట ఈ నెల 13న గచ్చిబౌలి స్టేడియంలో జరపాలనుకొన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకోకుండా నవంబర్ 19కు వాయిదా వేసారు. కాగా తాజాగా మరో విషయం ఏమిటంటే పంజా నిర్మాతలు పంజా ఆడియో ఫంక్షన్ కి చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్టు ఫిల్మిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.
రాజకీయాల్లోకి చిరంజీవి ఎంటర్ అయిన తర్వాత అతనికి మంచి చెడు ఎంత జరిగింది, ఏం జరిగింది అన్నది పక్కన పెడితే, చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ తో మాత్రం సంబంధాలు చెడిపోయాయని పుకారుంది. అందుకు తగ్గట్టే, పీఆర్పి ఓటమి తర్వాత ఒక్కసారి కూడా పవన్ ఎక్కడా రాజకీయాల ఊసెత్తలేదు. ఎప్పుడూ పవన్ చిరంజీవి కలిసి కనిపించలేదు.
అయితే ఆ బాధంతా పంజా ఆడియో రిలీజ్ వేడుకతో తీరిపోతుందని వినిపిస్తోంది. పంజా చిత్రాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండడంతో ఈ ఆడియో వేడుకకి చిరంజీవి, పవన్ కళ్యాన్ లతో పాటు మెగా హీరోలంతా హాజరవుతారని పిల్మిం ఇండస్ట్రి టాక్.
పంజా చిత్రాన్ని మెగా ఫ్యామిలీ మొత్తం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉండడంతో ఈ ఆడియో వేడుక ద్వారా ఫ్యాన్స్ లో నూతనోత్తేజం నింపి, వారిలో పాజిటివ్ ఫీల్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











