Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
అందుకే చెర్రీని చిరంజీవి అవాయిడ్ చేస్తున్నాడా?
తన తనయుడు రామ్ చరణ్ తేజను చిరంజీవి కావాలని అవాయిడ్ చేస్తున్నారా? అందుకే రచ్చ ఆడియో ఫంక్షన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అంటున్నారు మెగా కుటుంబం సన్నిహితులు. చిరంజీవి ఇలా ప్రవర్తించడం వెనక రెండు కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంజా ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో పవన్ కు, వారి మధ్య చెడిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే చిరంజీవి మాత్రం తాను బీజీగా ఉండటం రాలేదని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని వివరణ ఇచ్చారు.
తాజాగా రచ్చ ఆడియో ఫంక్షన్ కు కూడా గైర్హాజరు కావడం ద్వారా....తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నాననే కటింగ్స్ ఇవ్వడంతో పాటు, తమ్ముడి సినిమా వేడుకకు రాలేదు, కొడుకు సినిమా వేడుకకు వచ్చాడు అని ఆలోచన తలెత్తకుండా చేసినట్లు అవుతుందని చిరంజీవి భావిస్తున్నాడని అంటున్నారు.
రచ్చ ఆడియో వేడుక మార్చి 11న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. చరన్-తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ ఇందులో మెడికోగా కనిపించనున్నాడు.