twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే చెర్రీని చిరంజీవి అవాయిడ్ చేస్తున్నాడా?

    By Bojja Kumar
    |

    తన తనయుడు రామ్ చరణ్ తేజను చిరంజీవి కావాలని అవాయిడ్ చేస్తున్నారా? అందుకే రచ్చ ఆడియో ఫంక్షన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే అంటున్నారు మెగా కుటుంబం సన్నిహితులు. చిరంజీవి ఇలా ప్రవర్తించడం వెనక రెండు కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పంజా ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో పవన్ కు, వారి మధ్య చెడిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే చిరంజీవి మాత్రం తాను బీజీగా ఉండటం రాలేదని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని వివరణ ఇచ్చారు.

    తాజాగా రచ్చ ఆడియో ఫంక్షన్ కు కూడా గైర్హాజరు కావడం ద్వారా....తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నాననే కటింగ్స్ ఇవ్వడంతో పాటు, తమ్ముడి సినిమా వేడుకకు రాలేదు, కొడుకు సినిమా వేడుకకు వచ్చాడు అని ఆలోచన తలెత్తకుండా చేసినట్లు అవుతుందని చిరంజీవి భావిస్తున్నాడని అంటున్నారు.

    రచ్చ ఆడియో వేడుక మార్చి 11న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. చరన్-తమన్నా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. చరణ్ ఇందులో మెడికోగా కనిపించనున్నాడు.

    English summary
    The lifestyle of a celebrity is not just about being famous it is also about maintaining certain protocols especially in public events. Currently, it is heard that Chiranjeevi has been avoiding his son Ram Charan and there is a diplomatic reason behind it, as per sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X