Don't Miss!
- News డెడ్ లైన్ పెట్టిన ఎంపీ సుమలత, ఆ రోజు తేలిపోతుంది, టెన్షన్ పడుతున్న మాజీ సీఎం !
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
చిరంజీవే వెనక ఉండి నడిపించాడు
హైదరాబాద్ :ఇన్నాళ్లూ నార్త్లో బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఐఫా అవార్డుల వేడుక తాజాగా సౌత్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24,25 తేదీలలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ అవార్డుల వేడుక చాలా ఘనంగా జరిగింది తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.
అయితే హఠాత్తుగా సౌత్ కి వచ్చి మరీ ఐఫా అవార్డ్లు లు వేడుక ఎందుకు జరిపారనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి డౌట్స్ కు మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టారు. ఐఫా తన వల్లే హైదరాబాద్ కి వచ్చిందని అని చెప్పారు.
చిరంజీవి మాట్లాడుతూ... ‘కేంద్ర టూరిజం శాఖామంత్రి హోదాలో ఉన్నప్పుడు నేను విదేశాల్లో జరిగిన ఐఫా వేడుకలకి హాజరయ్యాను. అక్కడ ఐఫా యాజమాన్యాన్ని కలసి మా సౌత్ లో ఈ వేడుకలని ఎందుకు జరపకూడదు? అని అడిగాను. అందుకు వాళ్ళు బదులుగా....'త్వరలోనే అక్కడికి వస్తాం అన్నారు'. వాళ్ళు అన్నట్లుగానే ఇప్పుడు వచ్చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న ఇలాంటి అవార్డు వేడుకలు హైదరాబాద్ లోను తరుచుగా జరపాల్సిన అవసరం ఉన్నది' అని చిరు చెప్పారు.
రెండు రోజులు జరిగిన ఈ వేడుక సినీ ప్రియులను ఎంతగానో అలరించగా రామ్ చరణ్ , అఖిల్ లు తొలిసారి లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఐఫా వేడుకలో వ్యాఖ్యాతగా ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు అల్లు శిరీష్. సెలబ్రిటీల మీద చక్కటి వ్యంగ్యాస్ర్తాల్ని సంధిస్తూ కార్యక్రమాన్ని ఆసాంతం రక్తికట్టించారు.