హీరో చిరంజీవి తనకు ఉప్పు చేప, పప్పుచారు అంటే చాలా ఇష్టమని అనేకసార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు. అలాగే మటన్, చికెన్ వంటకాలను తీరిక వేళల్లో స్వయంగా వండుకోవడం తన హాబీలలో ఓకటని కూడా ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యం మీద, ఎక్సర్ సైజ్ ల మీద అధిక శ్రద్ధ తీసుకునే చిరంజీవి ఇప్పుడు తనకిష్టమైన నాన్ వెజ్ ఫుడ్ ను బాగా తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నాన్ వెజ్ స్ధానంలో వెజ్ ఫ్యాషన్ గా మారిన నేపధ్యంలో చిరంజీవి నిర్ణయాన్ని అభినందించాలి. త్వరలో తన రాజకీయ పార్టీ తరఫున రాష్ట్ర మంతటా పర్యటించనున్నందున బరువును బాగా తగ్గించుకుని రోజుకు పన్నెండు గంటల సేపు పర్యటనల్లో పాల్గొనాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.