Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మంత్రి మన మామయ్యేగా...!(బన్నీకి చిరు హెల్ప్?)
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కి మధ్య మామ-అల్లుళ్ల బంధం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరికి సంబంధించి ఫిల్మ్ నగర్లో ఓ గాసిప్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'ఇద్దరమ్మాయిలతో' అనే చిత్రం రూపొందుతోంది. ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ యూరఫ్లో ప్లాన్ చేసారు.
రెండు వారాలు అక్కడ షూటింగ్ జరుపాల్సి ఉండగా షూటింగ్కు సంబంధించిన అనుమతుల విషయంలో ఏవో చిన్న పాటి ఇబ్బందులు ఏర్పడ్డాయట. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో స్పెయిన్ పర్యనటలో ఉన్న చిరంజీవి చెవిన ఈ విషయం పడటంతో వెంటనే హెల్ప్ చేసాడని చర్చించుకుంటున్నారు. దీంతో షూటింగుకు వెంటనే అనుమతులు వచ్చాయని టాక్. అయితే ఈ వార్తలో నిజానిజాలు ఏమిటో తేలాల్సి ఉంది.
ఇద్దరమ్మాయిలతో సినిమా వివరాల్లోకి వెళితే... ఇందులో అమలా పాల్, కేథరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవలే ఈచిత్రం బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. హీరో ఇంట్రడక్షన్కి సంబంధించిన యాక్షన్ దృశ్యాలను అక్కడ చిత్రీకరించారు.
భారీ ఎత్తున సాగే ఈ యాక్షన్ విన్యాసాలను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసారు. థాయ్లాండ్కి చెందిన కెచే కంపక్డీ థాయ్ మార్షల్ ఆర్ట్స్ లో ఎక్సపర్ట్. ఇది వరకు ఆయన బ్లడ్ స్పోర్ట్ 2, ఓన్గ్ బాక్ 2తో పాటు పలు హాలీవుడ్ చిత్రాలకు పని చేసాడు. ఈ సినిమాలో మొత్తం 6 యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసాడట కెచె. ఇందుకుగాను అతనికి నిర్మాత బండ్ల గణేష్ రూ. 2 కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చాడని టాక్. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీప్రసాద్. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.