మెగాస్టార్ పవర్ తో విడుదలవుతున్న మెగాపవర్ స్టార్ ‘పంజా’..!?
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'పంజా" చిత్రం ఆడియో వేడుకను వచ్చే నెల 13న గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది ఈ యూనిట్. ఈ ఆడియో వేడుకను హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండో ర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ స్టేడియంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వేడుకలు జరపడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడంలేదు. చివరిగా ఇక్కడ జరిగిన వేడుకలు నాగార్జున 'కింగ్" ఆడియో.
ఆ తర్వాత ఈ స్టేడియంలో ఇలాంటి వేడుకలు జరపడానికి ఏపి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ 'పంజా ఆడియోను నిర్వహించడానికి చిరంజీవి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. తన ఇన్ ఫ్ల్యూయెన్స్ ని ఉపయోగించి 'పంజా" వేడుకను ఇక్కడ నిర్వహించడానికి పర్మిషన్ తీసుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ లో తనకు, ఎంత పవరుందో చిరంజీవి నిరూపించుకున్నాడని ఫిల్మిం పర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేవలం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసమే చిరు ఈ హెల్ప్ చేసాడని సమాచారం. సాధారణంగా ఆడియో ఫంక్షన్స్ అన్నీ శిల్పకళావేదికలో జరుగుతాయి. అయితే మెగాఫ్యాన్స్ ఎక్కువ గా ఉండటం చేత, పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తోటి ఈ నిర్ణయం తీసుకొని పర్మిషన్ తీసుకొన్నారని విశ్వసనీయ సమాచారం. ఈ ఆడియో వేడుకను మెగా అభిమానులు భారీ ఎత్తున రానున్నారని వినికిడి.


Click it and Unblock the Notifications











