చిరు కొత్త సినిమా అప్డేట్.. 17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్తో.. షూటింగ్కు ముహూర్తం ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి.. ఏజ్ బార్ అయినప్పటికీ.. హీరోగానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల తన తనయుడు రామ్ చరణ్ తో కలిసి... మల్టీస్టారర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నా స్థాయిలో రాలేదు. ఇప్పుడు ఆయన మరోసారి మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా తండ్రి పాత్రలో చిరంజీవి కనిపించనున్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
నెక్ట్స్ మూవీ అప్డేట్...:మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్యతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్ అంటూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, పోస్టర్స్ ఆకట్టుకోగా... ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. దీనికి కూడా మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే ఆయన నెక్ట్స్ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బయటకు వచ్చింది.

యంగ్ హీరోతో మల్టీ స్టారర్:చిరంజీవి, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా వచ్చేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చిరంజీవికి కల్యాణ్ కృష్ణ ఓ కథ వినిపించారని సమాచారం. ఈ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి తండ్రిగా నటిస్తే.. కుమారుడుగా ఓ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం.

17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో:ఈ సినిమా కథ విషయానికి వస్తే... తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథగా ఈ సినిమా రాబోతుంది. అయితే తండ్రి పాత్రలో చిరంజీవి నటించగా.. కొడుకు పాత్రకు సిద్ధు జొన్నలగడ్డ పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా త్రిష నటించనుండగా... సిద్ధూకు జోడీగా శ్రీలీల నటించనుందని తెలుస్తోంది. 17 ఏళ్ల తర్వాత చిరు త్రిషలు ఈ సినిమాలో నటించబోతున్నారని... ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక శ్రీలీల ఈమధ్య వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. మొన్న మహేశ్, పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోగా.. ఇప్పుడు చిరు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్.

అప్పుడే అనౌన్స్...:సొగ్గాడే చిన్ని నాయనా సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగు పెట్టాడు కల్యాణ్ కృష్ణ. ఆ తర్వాత పలు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. బంగార్రాజు సినిమా తర్వాత ఇప్పుడు చిరంజీవితో సినిమా చేసే అవకాశం కొట్టేశాడని టాక్. ఇక ఈ సినిమాకు సుస్మితా కొణిదెల ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుందట. ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఆగస్టులో వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 23న చిరంజీవి బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

తండ్రి కొడుకులుగా... :చిరంజీవి నటిస్తున్న ఈ సినిమా మలయాళం బ్రో డాడీ సినిమాకు రీమేక్ అని అంటున్నారు. మలయాళంలో స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన బ్రో డాడీ సినిమాను తెలుగులో తీయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయి.. ఆకట్టుకుంది. గతంలో ఈ సినిమాను వెంకటేశ్ రానా రీమేక్ చేస్తారనే వార్తలు రాగా.. ఇప్పుడు చిరు, సిద్దూ చేస్తారని వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి.


Click it and Unblock the Notifications











