Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరంజీవితో సినిమాపై కొరటాల స్కెచ్.. మెగా అభిమానుల్లో జోష్ నింపే లేటెస్ట్ అప్డేట్!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ ప్రాజెక్టు కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సామాజిక అంశాలతో ముడిపెడుతూ దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించనున్నారు కొరటాల. ఇక ఈ సినిమా కోసం మెగాస్టార్ తన లుక్ కూడా చేంజ్ చేసుకొని సరికొత్తగా కనిపించేందుకు రెడీ అయ్యారు.
ఇటీవలే కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. జనవరి మొదటి వారంలో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అప్డేట్ ప్రకారం కొరటాల ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
అంతేకాదు ఈ సినిమాలో ఇప్పటిదాకా హీరోయిన్ అనుకున్న త్రిష స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ పేరు పరిశీలిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసి 2020 స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట కొరటాల శివ. చిత్ర కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనుకాడనని ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్, కొరటాలకు మాటిచ్చారని సమాచారం. ఏదేమైనా షూటింగ్ ప్రారంభానికి ముంచే ఈ అప్డేట్స్ మెగా అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.