Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మెగా అప్డేట్.. చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్కి రంగం సిద్ధం.. డైరెక్టర్ ఎవరంటే!
గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ తెర పంచుకోబోతున్నారని, మెగా తండ్రీ కొడుకుల మల్టీస్టారర్ సినిమాకి రంగం సిద్ధమవుతోందని టాక్ నడుస్తోంది. కాగా తాజాగా ఇందుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. డైరెక్టర్ కూడా ఓకే అయ్యారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ వివరాలు చూస్తే..
చిరంజీవి 153 పై క్లారిటీ
తన 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`తో భారీ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఈ సినిమా అందించిన జోష్ లో ఇటీవలే కొరటాల శివతో తన 152వ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే చిరంజీవి 153వ సినిమాకు కూడా ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. కథ, డైరెక్టర్ విషయంలో ఓ క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది.
చిరంజీవి, రామ్ చరణ్ మల్టీస్టారర్
మలయాళంలో విజయవంతమైన చిత్రం `లూసిఫర్` సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ రీమేక్ సినిమాను చిరంజీవి 153 గా ప్రేక్షకుల ముందుకు తెస్తారని, అందులో రామ్ చరణ్, చిరు ఇద్దరూ నటించనున్నారని తెలుస్తోంది.
క్రియేటివ్ డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నారా?
చిరంజీవి 153 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా కోసం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ముందుకొచ్చారనేది తాజా సమాచారం. తండ్రీ కొడుకులను తనదైన క్రియేటివిటీతో తెరపైకి తీసుకొచ్చేందుకు సుకుమార్ ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఇదే నిజమైతే మెగా అభిమానులకు ఇంతకన్నా మించిన పండగ మరోటి ఉండదు మరి.
చిరంజీవి, రామ్ చరణ్ ఒక్కటై
మరోవైపు 'రంగస్థలం' సినిమా తర్వాత అల్లు అర్జున్తో ఓ సినిమా చేయడానికి సుకుమార్ రెడీ అవుతున్నారు. చిరంజీవి కూడా కొరటాల ప్రాజెక్ట్ తో బిజీ కాబోతున్నారు. సో ఈ రెండు సినిమాలు పూర్తికాగానే సుకుమార్, చిరంజీవి, రామ్ చరణ్ ఒక్కటి కానున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మూడు సార్లు చిరుతో చెర్రీని చూశాం కానీ..
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మగధీర' సినిమాలో రామ్ చరణ్తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన ‘బ్రూస్లీ' సినిమాలో అతిథి పాత్రలో కాసేపు రామ్ చరణ్ పక్కన కనిపించారు మెగాస్టార్. ఇక చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150'లో రామ్ చరణ్, చిరు కలిసి ''అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు'' పాటలో స్టెప్పులేశారు. కానీ ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం మాత్రం సుకుమార్ తోనే మొదలు అని తెలుస్తోంది.