Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మెగా అభిమానులకు షాక్.. 'సైరా నరసింహా రెడ్డి' క్లైమాక్స్ లీక్!
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. సరిగ్గా ఈ తరుణంలో 'సైరా నరసింహా రెడ్డి' క్లైమాక్స్ లీకైందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తుండటం మెగా అభిమానులను కలవరపెడుతోంది. వివరాల్లోకి పోతే..
తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ
సైరా నరసింహా రెడ్డిలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్ర పోషించారు. అయితే ఈ పాత్ర క్లైమాక్స్లో చంపి వేయబడుతుందని సమాచారం. చిరంజీవి ఫ్యాన్స్ గుండె బద్దలయ్యేలా ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేలా ఈ సన్నివేశం చిత్రీకరించారని ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.
భీకర యుద్ధంలో అసులువు బాసి..
నిజానికి చరిత్ర ప్రకారంగా చూస్తే.. అప్పట్లో బ్రిటిష్ సైన్యంతో జరిగిన భీకర యుద్ధంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అసులువు బాశారు. ఆయన మృతదేశాన్ని ఓ నెల పాటు కొండపైనే ఉంచడం జరిగింది. ఇందుకు సంబంధించిన సన్నివేశాలను డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎంతో జాగ్రత్తగా, తీవ్రమైన భావోద్వేగానికి గురి చేసేలా చిత్రీకరించారని తెలుస్తోంది.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిరంజీవి
'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో చిరంజీవిపై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు ఊహలకు అందనివిగా ఉండనున్నాయట. చిరంజీవి పాత్రను హైలైట్ చేస్తూ భారీ రేంజ్లో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారని ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తెలిసి పోయింది. ఇక ఇందులోని అబ్బురపరిచే స్పెషల్ ఎఫెక్ట్స్ థియేటర్స్లో చూడండని చిత్ర యూనిట్ పేర్కొనడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై మెగా పవర్స్టార్ రామ్చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటించింది. అమితాబ్ బచ్చన్, తమన్నా, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.