Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సిసిఎస్ పోలీస్ విచారణలో చిరంజీవి, సురేఖ..తప్పించుక తిరగుతున్న శిరీష్..
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్తపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త శారీరకంగానే కాకుండా, మానసికంగా వేధిస్తున్నాడంటూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదును ఎసీపీ సుధాకర్ కూడా ధృవీరించారు. గతంలో ఆర్యసమాజ్ అండతో పెద్దలను ఎదిరించి శ్రీజ-శిరీష్ భరద్వాజ్వలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. తాజాగా భర్తపై శ్రీజ ఫిర్యాదు చేయడం వారి కుటుంబాల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశమైంది.
చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన భర్త శిరీష్, అత్త సూర్య మంగళలు తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు శిరీష్ ను, సూర్య మంగళను విచారించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి ఇల్లు లాక్ చేసి ఉండటంతో వారి కోసం వెతుకులాట మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఇటీవల శ్రీజ తల్లిదండ్రులు అయిన చిరంజీవి, సురేఖలను పోలీసులు విచారించి స్టేట్ మెంట్లు తీసుకుని వాటిని రికార్డు చేసారని తెలుస్తోంది. కొంతమంది క్లోజ్ రిలేటివ్స్ నుండి కూడా స్టేట్ మెంట్లు తీసుకుని రికార్డు చేసారని సమాచారం.