Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘సైరా’ లేటెస్ట్ అప్డేట్: ఆ దేశంలో ట్రైలర్ విడుదల చేస్తారట.. ఎప్పుడో తెలుసా?
'సైరా: నరసింహారెడ్డి'.. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇది ఆయనకు 151వ చిత్రం. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కొణెదల ప్రొడక్షన్స్పై రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో చిరు సరసన నయనతార నటిస్తోంది. అలాగే, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్కు విశేష స్పందన వచ్చింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. 'సైరా: నరసింహారెడ్డి' ట్రైలర్ విడుదల చేయడానికి రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడట. అది కూడా ఇక్కడ కాదు.. ఖతార్లోని దోహాలో ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఆగస్టు 15, 16 తేదీల్లో అక్కడ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఫంక్షన్ జరగనుంది. అదే వేదికపై 'సైరా: నరసింహారెడ్డి' ట్రైలర్ విడుదల చేస్తారని ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అప్పటి లోగా ట్రైలర్ కట్ చేయాలని చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డికి రామ్ చరణ్ చెప్పాడని అంటున్నారు. ఈ సినిమా గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల కానుంది.
ఇక, సైమా అవార్డ్స్ విషయానికొస్తే... 2018లో ఈ నాలుగు భాషల్లో విడుదలైన అత్యుత్తమ చిత్రాలతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ విలన్, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ హాస్యనటుడు తదితర విభాగాల్లో అవార్డులు అందజేయనున్నారు. తెలుగులో 'రంగస్థలం' సినిమా అత్యధికంగా 12 విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆ తరవాత 'మహానటి' 9 విభాగాల్లో నామినేట్ అయ్యింది. 'గీత గోవిందం' 8, 'అరవింద సమేత' 6 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. మరి, తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు అవార్డుల కోసం వేచి చూడాలా..? 'సైరా' ట్రైలర్ కోసమా..?