Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Chiru154: మెగా ఫ్యాన్స్కు మరో ట్రీట్.. ఒకేసారి రెండు పండుగలు వచ్చేలా ప్లాన్
గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ స్వింగ్లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాశారు. ఇక, రెండు రోజుల క్రితమే మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' అనే సినిమాను అందించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
కాజల్ అగర్వాల్ ఎద అందాల ప్రదర్శన: తల్లైన తర్వాత ఫస్ట్ టైం ఇంత ఘాటుగా!
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మరో రెండు ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. అందులో ఆయన 154వ సినిమాగా వస్తున్న 'వాల్తేరు వీరయ్య' (పేరు అధికారికంగా ప్రకటించలేదు) ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవడంతో పాటు చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కు గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.
క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీ నుంచి టీజర్ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. దీన్ని ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని నవంబర్ 24 లేదా 25 తేదీల్లో విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. ఇదే నిజమైతే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పొచ్చు.
Mrunal Thakur: వ్యభిచార గృహంలో సీతా రామం హీరోయిన్.. రెండు నెలలు నరకం.. ఆ డైరెక్టర్ వల్లేనంటూ!
ఇదిలా ఉండగా.. చిరంజీవి - బాబీ కాంబోలో రాబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ను ఫిక్స్ చేసుకున్నారని తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.