Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఇబ్బంది పెట్టిన యాంకర్.. షో రికార్డింగ్ మధ్యలోనే వదిలేసి చిరు వాకౌట్.. ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆచార్య సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గురించి తాజాగా ఒక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
భారీ అంచనాలు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య రూపొందింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించారు. సినిమా మొదలు పెట్టక ముందు అనుకున్న కథ కాకుండా సినిమా మొదలు పెట్టిన తరువాత తర్వాత కథ మార్చారని ప్రచారం జరిగింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించింది కానీ ఆమె నటించిన అన్ని సీన్స్ కట్ చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. మొట్టమొదటిసారి రామ్ చరణ్ చిరంజీవి కలిసి చేస్తున్న పూర్తిస్థాయి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
భోళా శంకర్ సినిమా షూటింగ్
కానీ ఆ అంచనాలు అందుకోవడంలో సినిమా విఫలమైంది. సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో మెగాస్టార్ చిరంజీవి తాను ముందే ప్లాన్ చేసుకున్న వెకేషన్ కు వెళ్లిపోయారు. అలా వెళ్లిన ఆయన తన భార్య సురేఖ తో కలిసి సుమారు నెల రోజుల పాటు ఆయన విదేశాల్లో సమయం గడిపారు. ఈ మధ్యనే ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన మరి కొద్ది రోజులలోనే ఇప్పుడు మరో సినిమా షూటింగ్ లో పాల్గొన బోతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ జూన్ 21వ తేదీ నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతోంది.
షో నుంచి వాకౌట్
తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి ఒక షోకి చీఫ్ గెస్ట్ గా వెళ్లారని తెలుస్తోంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి షో స్పాన్సర్ విషయంలో ఒక పేరు తప్పుగా పలికారని, దీంతో మెగాస్టార్ చిరంజీవిని మరోసారి రీటేక్ చేయమని కోరారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో కాస్త హర్ట్ అయిన మెగాస్టార్ చిరంజీవి వెంటనే షో నుంచి వాకౌట్ చేశారని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వరుస సినిమాలు
అయితే ఆ షో ఏంటి అనే విషయం మీద ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లభించలేదు. కానీ దాని పేరు గురించి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఈ వ్యవహారం మాత్రం బయటకు రాలేదు. మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉన్నాయి. ఆయన హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయి.
దానయ్య నిర్మాణంలో
అలాగే మరో పక్క వెంకీ కుడుముల దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో కూడా ఆయన ఒక సినిమా చేస్తానని ప్రకటించారు. జూన్ 21వ తేదీ నుంచి భోళా శంకర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ లో సినిమా లో భాగమైన దాదాపు అందరూ కనిపిస్తారని తెలుస్తోంది.