Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చేజార్చాడు: రామ్ చరణ్పై చిరంజీవి అసంతృప్తి?
హైదరాబాద్: రామ్ చరణ్ తీరుపై చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారా? చెర్రీకి ఇంకా సరైన కథలు ఎంచుకునే పరిణితి రాలేదని ఆయన మదన పడుతున్నారా? చేతికొచ్చిన మంచి అవకాశాలను జార్చుకుంటున్నాడని లోలోన ఫీలవుతున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాల్లో!
ఇప్పటికీ రామ్ చరణ్ ఏదైనా సినిమా ఓకే చేయాలంటే....చిరంజీవి కథ వినాల్సిందే. రామ్ చరణ్కు ఇంకా సొంతగా సరైన సినిమాలు ఎంపిక చేసుకునే పరిణితి రాకపోవడం వల్లనే ఇలా జరుగుతుందని అంటున్నారు. ఇటీవల 'మనం' చిత్రం చూసిన తర్వాత రామ్ చరణ్ గురించి మరోసారి ఆలోచనలో పడ్డారట చిరంజీవి.
వాస్తవానికి 'మనం' చిత్రం కథను మొదట రామ్ చరణ్కు చెప్పాడట దర్శకుడు విక్రమ్ కుమార్. అయితే రామ్ చరణ్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. 'మనం' సినిమా చూసిన తర్వాత దర్శకుడి పని తీరును చూసిన చిరంజీవి.....రామ్ చరణ్ మంచి చాన్స్ చేజార్చుకున్నాడనే ఆలోచనకు వచ్చారట. భవిష్యత్లో దర్శకుడు విక్రమ్ కుమార్తో పని చేయాలని రామ్ చరణ్, బన్నీలకు సూచించారట.
అక్కినేని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' చిత్రం నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈచిత్రానికి 'ఇష్క్' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అక్కినేని నటించిన చివరి సినిమా కావడంతో ఈచిత్రపై ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.