Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చింతచచ్చినా పులుపుచావదు అందుకు నిదర్శనం చిరంజీవే...
చింత చచ్చినా పులుపు చావలేదని గత ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రస్తుత కాంగ్రెసు నేత మెగాస్టార్ చిరంజీవి ప్రకటన తెలియజేస్తోంది. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన ప్రజారాజ్యం పార్టీని స్థాపించారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన అది నిజం కాదని అనవచ్చు కాక, అదే నిజమని ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతోనే ఆయన కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని కూడా అనుకోవడంలో తప్పు లేదు. తన బలాన్ని కాంగ్రెసుకు దారాదత్తం చేయడం ద్వారా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారని అనుకోవచ్చు.
ముఖ్యమంత్రిపై ఆశలు పెట్టుకున్న చిరంజీవి సినీ రంగంలోకి తిరిగి అడుగుపెట్టబోనని శపథం చేశారు. చిన్న చితకా పాత్రలు చేయడానికి మనస్సు రాక ఆయన సినీ రంగానికి దూరంగానే ఉంటున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి పాత్ర వస్తే చేస్తారా అని అడిగితే నిజ జీవితంలోనే ముఖ్యమంత్రిగా జీవించే అవకాశం వస్తుంటే సినిమాల్లో ముఖ్యమంత్రిగా నటించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ మాట విన్న జర్నలిస్టులు నిజంగానే ఆశ్చర్యపోయి ఉంటారు. కాంగ్రెసులో ముఖ్యమంత్రి పీఠం చిరంజీవి అనుకున్నంత సులుభంగా చేతికి అందుతుందా అనేది వారి ఆశ్చర్యానికి కారణం. ఈ విషయం కూడా తెలియని చిరంజీవి ఆశల పల్లకీలో ఊరేగుతున్నారని అనిపించక మానదు.