Don't Miss!
- News ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Finance Tata Sons IPO: టాటా సన్స్ ఐపీఓ వస్తుందా.. రాదా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
చిరుత కాంబినేషన్ లో చరణ్ ఓ కొత్త లుక్ తో ఓ మాస్ సినిమా...!
ఆరెంజ్" సినిమా ఫ్లాప్ అవడంతో కథల ఎంపికలో జాగ్రత్తపడుతున్న రామ్ చరణ్ ముందు ఇప్పడు మొత్తం మూడు ప్రాజక్టులు వున్నాయి. 'ఏమైంది ఈ వేళ" చిత్ర దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో ఒక ప్రాజక్టు, వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో ప్రాజక్టు రెడీ అవుతున్నాయి. వీటిలో ముందుగా సంపత్ నంది ప్రాజక్టు పట్టాలెక్కనుంది. దానికి సమాంతరంగా వినాయక్ డైరెక్షన్ లో అల్లు అరవింద్ నిర్మించే భారీ చిత్రం షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
రామ్ చరణ్ తేజ్ ను వెండితెరకు కథానాయకుడిగా పరిచయం చేసిన చిత్రం 'చిరుత'. ఆ చిత్రాన్ని అందర్నీ అలరించేలా రూపొందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా తర్వాత చరణ్ ఇమేజ్ ఎంతగానో పెరిగిపోయింది. తొలి చిత్రం నాటి చరణ్ కూ, ఇప్పటి చరణ్ కూ చాలా తేడా వుంది. అయితే, మొన్నటి 'ఆరెంజ్' ఫ్లాప్ తో మళ్లీ అతని పరిస్థితి గాడితప్పింది. ఈ నేపథ్యంలో మళ్లీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చరణ్ ఓ చిత్రంలో నటించే అవకాశం వున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ ప్రముఖ నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. చిరంజీవి కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ప్రస్తుతం ఓ చక్కని కథకోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ రాబోయే సినిమాలలో డిఫరెంట్ లుక్ తో కనపడడం కోసమే ఇటీవల అమెరికాలోని మియామీలో డేవిడ్ బార్టాన్స్ జిమ్ లో విగరస్ వర్కౌట్స్ చేసి వచ్చాడు. మంచి మజిల్స్ తో చరణ్ బాడీ ఇప్పుడు కొత్త లుక్ తో వుంది. ఏమైనా, రాబోయే సినిమాలన్నీ తన మాస్ ఇమేజ్ కి తగ్గట్టుగానే ఉండేలా చరణ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి చిరుత కాంబినేషన్ లో ఈసారి ఎటువంటి సినిమా వస్తుందో చూడాల్సిందే..!