Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సీఎం ప్రమేయంతోనే బాలకృష్ణకు ‘నంది’ దక్కిందా?
2010 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో సింహా సినిమాలో నటనకు గాను...బాలకృష్ణకు ఉత్తమ నటుడు అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అయితే...బాలకృష్ణకు ఈ అవార్డు దక్కడం వెనక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి నంది అవార్డుల కమిటీ తొలుత....ఉత్తమ నటుడు కేటగిరీ కింద వేదం సినిమాలో అద్భుతమైన నటనకు గాను అల్లు అర్జున్ ను ఎంపిక చేశారని, అయితే...సీఎం కిరణ్ కుమార్ ఒత్తిడితో బాలకృష్ణకు కేటాయించారని తెలుస్తోంది. కిరణ్, బాలకృష్ణ కాలేజీ రోజుల నుంచి మంచి మిత్రులు కావడమే ఇందుకు కారణమట.
తాను సీఎం పదివిలో ఎంతకాలం ఉంటానో గ్యారంటీ లేదు కాబట్టి....పదవి ఉన్నప్పుడే తన మిత్రుడు బాలకృష్ణకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతోనే కిరణ్ ఈ పనికి పూనుకున్నట్లు చర్చించుకుంటున్నారు. పైగా 'సింహా" బంపర్ హిట్ కావడంతో ఎవరూ తప్పు పట్టే అవకాశం లేదనే భావనతో నంది అవార్డు కమిటీ కూడా సీఎం ఒత్తిడికి తలొగ్గారని భోగట్టా. అయితే, ఇటువంటి ప్రచారం బాలకృష్ణ నటనాశక్తిని తక్కువగా అంచనా వేయడమేనని అంటున్నారు. గిట్టనివారే బాలకృష్ణపై ఇటువంటి ప్రచారానికి దిగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.